Chandrababu: జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై
- By Hashtag U Published Date - 03:56 PM, Tue - 19 July 22
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై వైసీపీ నేతలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని పోలీసుల తీరును ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని బాబు మండిపడ్డారు.
పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే, ఎవరు బాధ్యత తీసుకుంటారని, జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి?నిద్రపోతున్నాయా?(1/3) pic.twitter.com/1a6JvxNfTN
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2022
Related News
Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న.. ఏమార్చడంలో ఎవర్గ్రీన్ చంద్రబాబు : రోజా
Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న అని, ఏమార్చడంలో ఎవర్గ్రీన్ చంద్రబాబు అని మంత్రి ఆర్కేరోజా అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఇరుగువాయి పంచాయతీ పరిధిలో ఇరుగువాయి, ఇరుగువాయి హరిజనవాడ, ఇరుగువాయి ఎస్టీ కాలనీ, పర్వతరాజపురం, పర్వతరాజపురం ఎస్టీ కాలనీలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మంగళ హరతులు పట్టారు. యువత జేజేలు పలికారు. ఉత్సాహంగా ఉరకలు వేస్�