Sugar Factories For Sale : అమ్మకానికి షుగర్ ఫ్యాక్టరీలు?
ఏపీలో షుగర్ ఫాక్టరీస్ మూసివేత దిశగా వెళ్తున్నప్పటికి ప్రభుత్వం అటు వైపు చూడటం లేదు. సహకార వ్యవస్థ మీద పట్టు కోల్పోతుంది.
- By CS Rao Published Date - 03:12 PM, Tue - 8 February 22
ఏపీలో షుగర్ ఫాక్టరీస్ మూసివేత దిశగా వెళ్తున్నప్పటికి ప్రభుత్వం అటు వైపు చూడటం లేదు. సహకార వ్యవస్థ మీద పట్టు కోల్పోతుంది. చెరకు రైతులు నష్టాల బాట న నడుస్తున్నారు. దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ ప్రగతి మార్గాన పయనిస్తోంది. కానీ,ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఈ రాష్ట్రంలో చెరుకు రైతును ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నారు. సహకార చెక్కర కర్మాగారాల పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని తాజాగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. . రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఏర్పడిన పంచదార మిల్లులు సమస్యలోకి వెళ్ళడానికి కొందరు పాలకుల పన్నాగాలు లేకపోలేదు. కేవలం షుగర్ కంపెనీలు పాలకులు బలి చేస్తున్నారు అని ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 శాతం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం. కడప, చిత్తూరు, విశాఖ పట్నం జిల్లాల్లో సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీలు మూత పడడం వల్ల సుమారు మూడు వేల మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. వేలాది మంది చెరుకు రైతుల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కనీసం 20 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే పలు సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్తితిలు ఉన్నా ప్రభుత్వం ముందుకు రావడంలేదు. పాయకరావుపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం దేశీయ పరిశ్రమలు అభివృద్ధికి ఇతోధిక సహకారం అందిస్తున్నా ఆ సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా లేక పోవడం గమనార్హం.2019 నవంబర్ మాసంలో కడప, చిత్తూరు జిల్లాల్లోని షుగర్ ఫ్యాక్టరీ లతో పాటు అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీల పనులు ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి సమీక్ష చేశారు. ఆ సమీక్ష చేసి సంవత్సరాలు గడుస్తున్నా అతిగతీలేదు. యాక్షన్ ప్లాన్ తయారు చేసి రెండు సంవత్సరాలు నిండినా షుగర్ ఫ్యాక్టరీ ల విషయంలో నోరుమెదపడం లేదు. సహకార రంగంలోని 10 పంచదార మిల్లులకు గాను కేవలం మూడు ఫ్యాక్టరీలకు మాత్రమే యాక్షన్ ప్లాన్ తయారు చేసినప్పటికీ అమలకు నోచుకోలేదు. చెరుకు రైతుల పట్ల వైఖరేంటి? వీటిని అమ్మేందుకు రంగం సిద్దం చేస్తున్నారన్న అనుమానాలు లేకపోలేదు.విశాఖ జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక, గోవాడ, తుమ్మపాల, నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు రాష్ట్రప్రభుత్వం నిర్వాకం వల్లే అప్పుల ఊబిలోకి దిగజారాయని కార్మికులు చేస్తున్న ఆందోళన. ఆ కార్మికులకు 33 నెలలుగా జీతాలు ఇవ్వలేదు., రైతులకు చెరుకు సొమ్ము సంవత్సర కాలంగా ఇవ్వలేదు. ఈవిధంగా ఒక్కో ఫ్యాక్టరీని నష్టపరిచి ప్రైవేటు వ్యక్తులకు దొడ్డిదారిన అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారా? అనే అనుమానాలు లేకపోలేదు. పంచదార మిల్లుల్లో పని చేసే కార్మికుల పరిస్థితి పై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో స్పష్టం చేయాలని బిజెపి ఏపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తం గా పోరాటం చేయాలని సోమూవీర్రాజు ప్లాన్ చేస్తున్నాడు. షుగర్ ఫ్యాక్టరీ లపై తాడోపేడో తేల్చుకోవడానికి ఆ పార్టీ సిద్దం అయింది. సో..బీజేపీ పోరాటం చేయడానికి ఒక మంచి ఆయుధం దొరికిందన్నమాట.
Related News
Nallamilli Ramakrishna Reddy : అనపర్తి టీడీపీ ఇంచార్జికి బీజేపీ ఆఫర్..!
గత కొద్ది రోజులుగా అనపర్తి టీడీపీ (TDP) ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి (Nallamilli Ramakrishna Reddy) సీటును బీజేపీ (BJP)కి ఇవ్వడాన్ని నిరసిస్తూనే ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని జగన్ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో చాలా ఇబ్బంది పెట్టింది. నల్లమిల్లి సీటు బీజేపీకి దక్కడంపై షాక్కు గురయ్యారు.