HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Strict Measures To Make People Afraid To Do Wrong Minister Lokesh

Assembly : తప్పు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు : మంత్రి లోకేశ్‌

టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

  • By Latha Suma Published Date - 12:17 PM, Thu - 13 March 25
  • daily-hunt
Strict measures to make people afraid to do wrong: Minister Lokesh
Strict measures to make people afraid to do wrong: Minister Lokesh

Assembly : గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాగానే ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్‌, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి నారా లోకేశ్‌ వారికి సమాధానమిచ్చారు. ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని లోకేశ్‌ అన్నారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Read Also: Phone : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. ఇలా చెయ్యండి ఈజీగా దొరికేస్తుంది

టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ఉంటాయన్నారు. విజిలెన్స్ రిపోర్టును సభ్యులకు అందజేస్తామన్నారు. ప్రపంచంలోని టాప్ 100లో ఏయూ ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి చెప్పారు. సంస్కరణలో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్ మేథ్స్ ప్రొఫెసర్ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు.

ఇక, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. గతంలో ఏయూ వైసీపీ కార్యాలయంగా మారిందన్నారు. ఇక్కడ కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆ నిధులను జగన్ విశాఖ వచ్చినట్టు మూడు హెలిపాడ్లు తయారు చేయాలని ప్లాన్‌ వేశారన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన చెట్లను సైతం నరికేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అవుతున్నా ఇంకా ఉపేక్షించడం తగదన్నారు. నిర్దిష్ట కాలపరిమితితో విచారణను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

మరో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. విచారణ కమిటీకి నిర్థిష్టమైన కాల పరిమితి ఉండాలన్నారు. ఆ తర్వాత శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. వైసీపీ హయాంలో యూనివర్సిటీలు రాజకీయాలకు అడ్డాగా మారాయన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు ఉండాలన్నారు. కచ్చితంగా విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి వైకాపా అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని ఆరోపించారు. ఎంతో పేరున్న ఏయూను రాజకీయ వేదికలా ఆయన మార్చారని ఆక్షేపించారు. ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.

Read Also: HYD Metro Rail : నిషేధిత వస్తువులు గురించి ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra university
  • ap assembly
  • Minister Lokesh
  • university irregula
  • Vigilance investigation

Related News

Ap Mock Assembly Held On Co

AP Mock Assembly Held on Constitution Day : పిల్లల సభ అదిరింది.. పెద్దల తీరు మారాలి!

AP Mock Assembly Held on Constitution Day : ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఉద్దేశించిన అత్యున్నత వేదిక శాసనసభ (అసెంబ్లీ). అయితే కొన్నేళ్లుగా రాష్ట్ర అసెంబ్లీలలో నిర్మాణాత్మక చర్చలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్న

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd