Srisailam : అటవీ జంతువులకు `శ్రీశైలం హైవే` ప్రాణగండం
శ్రీశైలం హైవేపై జరుగుతోన్న రోడ్డు ప్రమాదాల్లో 12శాతానికిపైగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు వెళ్లే మార్గంలోనే జరుగుతున్నాయి.
- By CS Rao Published Date - 02:09 PM, Mon - 15 November 21
శ్రీశైలం హైవేపై జరుగుతోన్న రోడ్డు ప్రమాదాల్లో 12శాతానికిపైగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు వెళ్లే మార్గంలోనే జరుగుతున్నాయి. వేగ పరిమితి 30 కిలో మీటర్లు మాత్రమే ఉండగా 80 నుంచి 120 కిలో మీటర్ల వేగంతోనూ కొందరు వాహనాలు నడుపుతుంటారు. ఆ కారణంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు, జంతువులు చనిపోతున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఎక్కువగా కోతులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి తీసుకొచ్చిన కోతులను శ్రీశైలం అడవుల్లో వదిలేస్తున్నారు. గుంపులు, గుంపులుగా రోడ్డు మీద కోతులు ఉంటున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు గురవుతున్నాయి.
Also Read : ప్రమాదం లో గజరాజులు!
అడవిలో బతకలేక, కోతులు హైవే చుట్టూ తిరుగుతూ ప్రయాణికులు విసిరే తినుబండాలను తింటాయి. ఆ క్రమంలో అప్పుడప్పుడు ప్రయాణిస్తున్న వాహనాల టైర్ల క్రిందకు వచ్చి ప్రమాదంలో చనిపోతున్నాయి. వివిధ రకాల కోతులు అడవీలో ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాల నుంచి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టనవి ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2017 నుండి, అటవీ శాఖ 85 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 208 వన్యప్రాణులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని లెక్కించింది. వాటిలో, 26 రీసస్ మకాక్తో సహా 58 ప్రైమేట్స్ తో పాటుఅన్ని రకాల పాములు ఉన్నాయి. సరీసృపాలు అత్యధికంగా 97 మరణించాయి. రెడ్ శాండ్ బోవా ఎక్కువగా 11 మరణించినట్టు తేల్చారు. మానిటర్ బల్లులు, లంగర్లు, సివెట్లు, మచ్చల జింకలు, అడవి పంది మరియు పోర్కుపైన్ రోడ్డు ప్రమాదాంలో చనిపోయిన జాబితాలో ఉన్నాయి.
Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు
గత నాలుగేళ్లలో గణాంకాలను క్రోడీకరించినప్పటికీ, గత రెండు నెలల్లో మాత్రమే డేటా సేకరణ క్రమబద్ధీకరించబడిందని అధికారులు చెబుతున్నారు.ప్రతి ఫారెస్ట్ రేంజ్ అధికారి నెలాఖరులో వన్యప్రాణుల ప్రాణనష్టం గురించిన డేటాతో ప్రొఫార్మాను పూరించవలసిందిగా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అటవీ పరిశీలకులు, భౌగోళిక కోఆర్డినేట్లతో రోడ్డు ప్రమాదాల గురించి సమాచారాన్ని పోస్ట్ చేయాలని భావిస్తూ సోషల్ మీడియా లో ఒక గ్రూప్ ప్రారంభించబడింది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, ఈ ఏడాది అక్టోబర్లో మొత్తం 59 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు గుర్తించారు.టైగర్ రిజర్వ్లో గంటకు 30 కి.మీ వేగ పరిమితిని సూచించే సూచిక బోర్డులు హైవే వెంబడి ఉన్నప్పటికీ, గంటకు 80 నుండి 120 కి.మీ వేగంతో వెళ్లే వాహనాలు వెళుతున్నాయి. “రోడ్డు జాతీయ రహదారులకు చెందినది కాబట్టి మా చేతులు కట్టివేయబడ్డాయని అటవీ అధికారులు అంటున్నారు. స్పీడ్-బ్రేకర్ల కోసం అభ్యర్థనలు చాలా అరుదుగా చేస్తుంటామని, కానీ వేగ పరిమితిని ఖచ్చితంగా అమలు చేయడం లేదు, ”అని ఒక అధికారి వివరించాడు.
Related News
Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ
Elephants Attack : ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.