Stone Attack on Jagan : జగన్ పై రాయి తో దాడి చేసిందెవరో కనిపెట్టిన పొలీసులు
జగన్ ఫై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు
- Author : Sudheer
Date : 16-04-2024 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ ఫై జరిగిన రాయి దాడి (Stone Attack on Jagan) పై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కు సంబంధించి నలుగుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా..వారిలో ఓ యువకుడు దాడి చేసినట్లు గుర్తించారు. జగన్ ఫై దాడి చేసిన వ్యక్తి.. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. దాడి వెనుక ఉన్న కారణాలపై సతీష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా సతీష్ను గుర్తించినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా శనివారం విజయవాడలో యాత్ర చేస్తుండగా.. జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి బలంగా రాయి విసరడంతో జగన్ కనుబొమ్మకు తగిలి గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. వెంటనే జగన్కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర ముఖ్యమంత్రి కొనసాగించారు. అనంతరం వైద్యుల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి తగిలిన గాయానికి చికిత్స తీసుకున్నారు. ఆదివారం రిస్ట్ తీసుకున్న జగన్..సోమవారం తిరిగి తన యాత్రను మొదలుపెట్టారు.
Read Also : Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..