HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Indian Railways Celebrates 171 Years

Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..

1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది

  • By Sudheer Published Date - 11:18 AM, Tue - 16 April 24
  • daily-hunt
Indina Railway
Indina Railway

భారతీయ రైల్వే (Indian Railway)కు పునాది పడి సరిగ్గా నేటికీ 171 ఏళ్లు అవుతుంది. 1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. 34 కిలోమీటర్ల మేర ఏర్పాటైన ఈ ట్రాక్ ఫై13 బోగీలతో రైలు నడిచేది. సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే మూడు ఇంజిన్లను ఈ రైలును నడిపేందుకు ఉపయోగించారు. 13 బోగీలతో మొదలైన భారతీయ రైలు..నేడు వందే భారత్ అంటూ పరుగులు పెడుతుంది.

మనదేశంలో (India) మొదటిసారిగా 1853 లో రైలును ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతుంది. ప్రస్తుతం ప్రతి రోజు 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవల్ని అందిస్తోంది. ప్రతీ ఏటా 822 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవల్ని అందిస్తూ అతిపెద్ద రికార్డే గా నిలుస్తుంది.

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ “భారతీయ రైల్వే” అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్, విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది.

We’re now on WhatsApp. Click to Join.

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. దేశ వ్యాప్తంగా 114500 కి.మీ రైలు మార్గాలు ఉన్నాయి. మొత్తం 7500 స్టేషన్లు , రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వే రెండో స్థానంలో ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది.

* భారతీయ రైల్వేలో వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి 4273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు 4 రోజుల పాటు ఈ రైలు ప్రయాణిస్తుంది. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలు ఇదే.

* వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రాకముందు వరకు న్యూ ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా వార్తల్లో ఉండేది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత వందేభారత్ ట్రైన్ గంట కు 160 కిమీ వేగంతో నడుస్తుంది. ఇక ఇటీవల ప్రారంభించిన ట్రెయిన్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

* భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్ పొడవు 1366 మీటర్లు. అంటే ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువే అన్నమాట.

* మనదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న నుండి ముంబై విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ మధ్య నడిచింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్ విస్తరించింది. ఇలా భారత రైల్వే రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది.

#ThisDayThatYear
Celebrating 171 illustrious years of Indian Railways!
On 16 April 1853, the 1st passenger train ran from Bori Bunder (Bombay) to Thane, marking the beginning of an incredible journey! 🚉#DownTheMemoryLane https://t.co/PlMm0m2EOv

— Ministry of Railways (@RailMinIndia) April 16, 2024


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 171st Anniversary
  • indian railways

Related News

Train

Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్‌పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

    Latest News

    • Russia : ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా డ్రోన్, క్షిపణుల దాడి

    • Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో

    • Sponge Park : వరదలకి చెక్.. వినోదానికి సెంటర్ – చెన్నైలో స్పాంజ్ పార్క్

    • Jharkhand Encounter : ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. 10 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు హతం

    • Heavy Rain in Warangal : వరంగల్ ను ముంచెత్తిన భారీ వర్షం

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd