HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Singanamala Mla Jonnalagadda Padmavathi Fire On Govt

AP : ఎందుకింత చిన్నచూపు అంటూ జగన్ ఫై..మరో ఎమ్మెల్యే ఆరోపణలు

  • Author : Sudheer Date : 08-01-2024 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Singanamala Mla Jonnalagadd
Singanamala Mla Jonnalagadd

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా సొంత పార్టీల నేతలు షాకులు ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గ మార్పులు మొదలుపెట్టారో..అప్పటి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ సర్వే ల పేరుతో టికెట్ ఇవ్వనని చెప్పడం సబబు కాదని..జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జగన్ తీరు నచ్చక పార్టీ నుండి బయటకు రాగా..మరికొంతమంది బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా తనకు టికెట్‌ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Singanamala MLA Jonnalagadda Padmavathi) ఫేస్‌బుక్‌ లైవ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే పద్మావతి అంటున్నారు. హైకమాండ్‌ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్‌ చేసుకుంటూ వెళ్లానని వివరించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని చెబితే, అలా చేస్తే ఇమేజ్‌ పెరుగుతుందని జగన్‌ చెప్పారని, అందుకు అనుగుణంగానే నడుచుకున్నామన్నారు. ఇక బస్సుయాత్రల గురించి కూడా జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్‌ లైవ్‌లో వ్యాఖ్యానించారు. టికెట్‌ ఖరారు అయినవాళ్లకే బస్‌ యాత్రలో పాల్గొనేలా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే తమ నియోజకవర్గానికి నీరు రావడం లేదని వాపోయింది. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని , ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పానికి తీసుకెళ్తున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్పితే.. సమస్యను పరిష్కరించింది లేదన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని.. కులాలకు, మతాలకు అతీతంగా తనను శింగనమల ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గం నుంచి కాలువలు వెళ్తున్నా.. తమ ప్రాంతం వారికి మాత్రం నీరు అందడంలేదన్నారు. ఐఏబీ మీటింగ్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.. నీళ్లు కావాలంటే సీఎం ఆఫీస్‌కి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలా..? నీళ్లకోసం మాట్లాడితే పెద్ద నేరమా..? అన్నారు. ఎస్సీ మహిళ కాబట్టి నోరు తెరిచి మాట్లాడకూడదా.. ఐదేళ్లుగా తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని.. కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వరదలొస్తేనే నీళ్లు ఇస్తారా.. ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? అన్నారు నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి?.. ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా? ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు.

Read Also : Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Singanamala MLA Jonnalagadda Padmavathi
  • ycp

Related News

Minister Vasamsetti Subhash

భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ బుక్స్‌లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • Apsrtc Samme

    వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd