HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Serious Water Accidents In Ap 1000 People Die Every Year

AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!

ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.

  • By Balu J Published Date - 12:31 PM, Wed - 20 December 23
  • daily-hunt
Beach Imresizer
Beach Imresizer

AP Deaths: 2017- 2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 10,076 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఎక్కువ మంది యువకులేనని (NCRB) తమ రిపోర్ట్ లో తెలిపింది.  ఈ కాలంలో APలో 9,500 కంటే ఎక్కువ ఇటువంటి సంఘటనలు జరిగాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మరణాలు ఉన్నాయి. అవగాహన పెంపొందించడం, నీటి చెరువుల దగ్గర, చుట్టుపక్కల మెరుగైన భద్రతా చర్యలు, పిల్లలు, యువకులకు ఈత పాఠాలు నేర్పడం వంటి వాటి అవసరం. ఈ జాగ్రత్తలతో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు చెక్ పెట్టాలని సూచించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం 2020లో ఈ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 1,699 సంఘటనల్లో 1,799 మంది మరణించారు. 2022లో 1,777 మంది నీట మునిగి చనిపోయారు. 2018లో 1,596 ఘటనల్లో 1,666 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 1,539 ఘటనల్లో మునిగి 1,646 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో 1,507 ఘటనల్లో 1,634 మంది ప్రాణాలు కోల్పోగా, సగటున 1,5514 మంది ఏపీలో 149011 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంవత్సరం కనీసం 1,500 నుండి 1,600 మంది నీట మునిగి మరణిస్తున్నారు మరియు బాధితులలో ఎక్కువ మంది యువకులే,” అని డేటా చూపించింది.

నీటి వనరులు (నదులు, రిజర్వాయర్లు, బీచ్‌లు మొదలైనవి) గురించి తెలియకపోవడం, ఈత గురించి ప్రాథమికంగా తెలియకుండా వాటిలోకి  దూకడం ఈ మరణాలకు కారణాలు  అని పోలీసు అధికారి తెలిపారు. చెరువులు, బావులు, సముద్రాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ యువకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి. 2019 సెప్టెంబరులో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడడంతో కొంతమంది చిన్నారులు సహా 51 మంది మునిగిపోవడం గమనార్హం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP crime news
  • Boat Accident
  • deaths
  • Swimming Fools

Related News

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd