HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sc Summons Andhra Pradesh Chief Secretary Over Disbursal Of Covid Death Claims

Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై ‘సుప్రీం’ సీరియస్!

COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

  • By Balu J Published Date - 04:39 PM, Wed - 19 January 22
  • daily-hunt
Supreem Court
Supreem Court

COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రధాన కార్యదర్శులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌గా హాజరు కావాలని, వారి రాష్ట్రాల్లో కోవిడ్-19 మరణానికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ఎందుకు పంపిణీ చేయలేదో వివరించాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు MR షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తుందని, కోవిడ్-19 కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు రిజిస్ట్రేషన్, పంపిణీని సులభతరం చేయడానికి రాష్ట్ర న్యాయ సేవా అధికారులను (SLSA) కోరింది.

బీహార్ ఇచ్చిన COVID-19 మరణాల సంఖ్యను తిరస్కరిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇవి వాస్తవమైనవి కాదని, ప్రభుత్వ గణాంకాలు అని తెలిపింది. “కోవిడ్ కారణంగా బీహార్ రాష్ట్రంలో కేవలం 12,000 మంది మాత్రమే మరణించారని మేం నమ్మడం లేదు. మీ ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌గా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము” అని బీహార్ ప్రభుత్వం తరపు న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది.  COVID-19 బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా సహాయం కోరుతూ న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్, న్యాయవాది సుమీర్ సోధి ప్రాతినిధ్యం వహించిన మధ్యవర్తులు చేసిన అభ్యర్థనలను కోర్టు విచారించింది. గత ఏడాది డిసెంబర్ 13న, కోవిడ్-19 మరణాలకు ఎక్స్‌ గ్రేషియా పరిహారం పంపిణీ కోసం అభివృద్ధి చేసిన పోర్టల్ గురించి విస్తృత ప్రచారం కల్పించనందుకు రాష్ట్రాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. విస్తృత ప్రచారం చేయకపోతే, ప్రజలు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునే పోర్టల్ చిరునామాను తెలుసుకోలేరని పేర్కొంది.

కొన్ని రాష్ట్రాలు వార్తాపత్రికలకు ప్రకటనలు, ముఖ్యంగా ప్రాంతీయ, స్థానిక చానెల్స్ లకు పూర్తి వివరాలను చేరవేయలేదని కోర్టు పేర్కొంది. కోవిడ్-19 బాధితుల బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పరిహారం పంపిణీలో పురోగతిపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించాలని కోర్టు గతంలో కేంద్రాన్ని కోరింది. దానికి విరుద్ధంగా స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. గత ఏడాది నవంబర్ 18న, కోవిడ్-19 కారణంగా మరణించిన వారి తదుపరి బంధువులకు ఎక్స్‌ గ్రేషియాకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలకు “కేవలం విరుద్ధంగా” నోటిఫికేషన్ జారీ చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను “ఓవర్‌రీచ్” చేయడానికి ప్రయత్నం జరిగింది.

మరణ ధృవీకరణ పత్రంలో వైరస్ కారణమని పేర్కొనలేదనే కారణంతో కేవలం కోవిడ్-19 కారణంగా మరణించిన వారి తదుపరి బంధువులకు రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని ఏ రాష్ట్రమూ నిరాకరించరాదని గత ఏడాది అక్టోబర్ 4న పేర్కొంది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తి మరణానికి సంబంధించిన రుజువుతో పాటు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా సంబంధిత జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసిన తేదీ నుండి 30 రోజులలోపు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోవిడ్-19 కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలనే దాని ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, నష్టపరిహారం ఇవ్వడానికి స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • covid19
  • death claimes
  • india
  • Supreem court

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd