HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rs 1500cr Land Scam In Vizag Alledges Tdp Leader

Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ‌ ‘భూంఫ‌ట్‌’

విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బ‌య‌ట పెట్టింది. ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌లు ఆ భూముల‌ను మింగేశార‌ని ఆరోప‌ణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఆ పార్టీ నేత‌లు చూపుతున్నారు.

  • Author : CS Rao Date : 05-04-2022 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Velagapudi Vijaysaireddy
Velagapudi Vijaysaireddy

విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బ‌య‌ట పెట్టింది. ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌లు ఆ భూముల‌ను మింగేశార‌ని ఆరోప‌ణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఆ పార్టీ నేత‌లు చూపుతున్నారు. క్విడ్ ప్రో కో కింద 1500 కోట్ల విలువ చేసే భూముల‌ను కేవ‌లం 187 కోట్ల‌కు ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్టార‌ని వెలికితీసింది. ఆ పార్టీ నేత‌లు చెబుతున్న దాని ప్ర‌కారం…
విశాఖ జిల్లా రిషికొండ ఐటి సెజ్ స్థలంలో బినామీ పేర్లతో కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వ పెద్దలు అన్యాక్రాంతం చేశారు. ఎన్సీసీ (NCC) కి చెందిన రూ. 1500 కోట్ల భూ పందేరంలో కీలక సూత్రధారులున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పల్లా శ్రీనివాస్ లు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటికే సింగపూర్ కంపెనీతో ఎన్సీసీ సుమారు రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టించింది. అయితే విశాఖ కేంద్రంగా ఉన్న కీలక వైసీపీ నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్ప‌డంతో బెంగుళూరుకు చెందిన జీఆర్‌పీఎల్ (Grpl) హోసింగ్ కంపెనీ తెరపైకి వచ్చింది. సింగపూర్ కంపెనీని కాదని జీఆర్‌పీఎల్‌తో ఎన్సీసీ ఒప్పందం కుదుర్చుకుందంటూ వివాదం చెలరేగింది.97 ఎకరాలను కేవలం రూ. 187 కోట్లకు హౌసింగ్ బోర్డ్ నుంచి ఎన్సీసీ తీసుకుందని మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుంది. ఆ మేర‌కు టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. విశాఖ‌ను YSRCP MP విజయసాయిరెడ్డి నుంచి రక్షించాలంటూ వాళ్లు కోరుతున్నారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు మళ్ళీ క్విడ్ ప్రో మొదలెట్టారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రిషికొండ వద్ద టీడీపీ నేతలు భారీ ధర్నా చేయ‌డం ద్వారా అక్క‌డ జ‌రిగిన అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నించారు.

రూ.1500 కోట్ల స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రూ.1500 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. Ncc కి తక్కువ రేటు ఇవ్వడానికి కారణమేంటి, Grpl కంపెనీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఓపెన్ ఆక్షన్ పెట్టాలని తద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. విశాఖ నుంచి లూలు, టెంపుల్తన్ పంపేశారని, ఇపుడు సింగపూర్ కంపెనీని కూడా పంపేస్తున్నారని తెలిపారు. ఐటి సెజ్ భూ కేటాయింపులు రద్దు చేసేంతవరకూ టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చ‌రించారు. ఏదేమైనా విశాఖలో వరుసగా బయటకికొస్తున్న భూ వివాదాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిజాలు బయటకు పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • land scam
  • vijay sai reddy
  • vizag

Related News

Chandrababu Naidu Lays Foun

Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది

    Latest News

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

    • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd