Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ ‘భూంఫట్’
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు.
- By CS Rao Published Date - 05:50 PM, Tue - 5 April 22
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు. క్విడ్ ప్రో కో కింద 1500 కోట్ల విలువ చేసే భూములను కేవలం 187 కోట్లకు ప్రభుత్వంలోని పెద్దలకు కట్టబెట్టారని వెలికితీసింది. ఆ పార్టీ నేతలు చెబుతున్న దాని ప్రకారం…
విశాఖ జిల్లా రిషికొండ ఐటి సెజ్ స్థలంలో బినామీ పేర్లతో కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వ పెద్దలు అన్యాక్రాంతం చేశారు. ఎన్సీసీ (NCC) కి చెందిన రూ. 1500 కోట్ల భూ పందేరంలో కీలక సూత్రధారులున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పల్లా శ్రీనివాస్ లు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటికే సింగపూర్ కంపెనీతో ఎన్సీసీ సుమారు రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టించింది. అయితే విశాఖ కేంద్రంగా ఉన్న కీలక వైసీపీ నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్పడంతో బెంగుళూరుకు చెందిన జీఆర్పీఎల్ (Grpl) హోసింగ్ కంపెనీ తెరపైకి వచ్చింది. సింగపూర్ కంపెనీని కాదని జీఆర్పీఎల్తో ఎన్సీసీ ఒప్పందం కుదుర్చుకుందంటూ వివాదం చెలరేగింది.97 ఎకరాలను కేవలం రూ. 187 కోట్లకు హౌసింగ్ బోర్డ్ నుంచి ఎన్సీసీ తీసుకుందని మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుంది. ఆ మేరకు టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. విశాఖను YSRCP MP విజయసాయిరెడ్డి నుంచి రక్షించాలంటూ వాళ్లు కోరుతున్నారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు మళ్ళీ క్విడ్ ప్రో మొదలెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు. రిషికొండ వద్ద టీడీపీ నేతలు భారీ ధర్నా చేయడం ద్వారా అక్కడ జరిగిన అక్రమాలను బయటపెట్టాలని ప్రయత్నించారు.
రూ.1500 కోట్ల స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రూ.1500 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. Ncc కి తక్కువ రేటు ఇవ్వడానికి కారణమేంటి, Grpl కంపెనీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఓపెన్ ఆక్షన్ పెట్టాలని తద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. విశాఖ నుంచి లూలు, టెంపుల్తన్ పంపేశారని, ఇపుడు సింగపూర్ కంపెనీని కూడా పంపేస్తున్నారని తెలిపారు. ఐటి సెజ్ భూ కేటాయింపులు రద్దు చేసేంతవరకూ టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఏదేమైనా విశాఖలో వరుసగా బయటకికొస్తున్న భూ వివాదాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిజాలు బయటకు పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Related News
Charan & Princess KlinKaara : కూతురి తో వైజాగ్ బీచ్లో సందడి చేసిన రామ్ చరణ్..
రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు