RGV: ప్రకాశం బ్యారేజ్ పై ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా షూటింగ్.. ఎన్నికలకు ముందే రిలీజ్ అన్న RGV
‘వ్యూహం’ సినిమా రెండు భాగాలను కలిగి ఉందని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) తెలిపారు.
- By Prasad Published Date - 08:23 PM, Sun - 13 August 23
‘వ్యూహం’ సినిమా రెండు భాగాలను కలిగి ఉందని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు రామ్గోపాల్ వర్మ (RGV) తెలిపారు. వ్యూహం చిత్ర యూనిట్ ప్రకాశం బ్యారేజీపై సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం మీడియాతో రామ్గోపాల్ వర్మ (RGV) మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘వ్యూహం’ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ముఖ్యమైన రాజకీయ పరిణామాలను సినిమాలో చిత్రీకరిస్తున్నామని.. ఇప్పుడే అన్నింటినీ తాను వెల్లడించబోనని చెప్పారు. సినిమాలో వై ఎస్ వివేకానంద హత్య ఘటన కూడా ఉంటుందని చెప్పారు. తాను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానినని తెలిపారు.
ఈ సినిమాకు వైసీపీ నుంచి ఎలాంటి ఫండింగ్ లేదని, సినిమా వెనుక సినీ నిర్మాత దాసరి కిరణ్ మాత్రమే ఉన్నారన్నారు. ఈ చిత్రంలో వైయస్ జగన్, వైయస్ భారతి, పవన్ కళ్యాణ్ తదితరుల పాత్రలు ఉంటాయని ఆయన చెప్పారు. చిత్రం, ఇతివృత్తం గురించి అడగ్గా వ్యూహం పొలిటికల్ థ్రిల్లర్ అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ కార్యక్రమాల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలో సినిమా, షూటింగ్లపై టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన రామ్ గోపాల్ వర్మ తనకు విమర్శలు ఇష్టమన్నారు. వ్యూహం సినిమాకు టీడీపీ నేతలు ఉచిత ప్రచారం కల్పిస్తున్నారని, దానిని స్వాగతిస్తున్నామన్నారు.
Also Read: Dhanush : ధనుష్ నటుడు కాకముందు ఏమవ్వాలి అనుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..
Related News
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి