Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు
- Author : Prasad
Date : 26-05-2026 - 8:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. AP 39 TK 3741 నంబర్ గల సితార ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు డివైడర్ను ఢీకొని దానిపైనే ఆగిపోయింది. బస్సు ముందు భాగం వంతెన అంచున ప్రమాదకర స్థితిలో వేలాడుతూ కనిపించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో పాటు డివైడర్ అడ్డుగా నిలవడంతో బస్సు కెనాల్లో పడకుండా నిలిచిపోయిందని తెలుస్తోంది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనతో స్థానికులు, ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.