HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prashant Kishore Predicts Ap Cm Ys Jagan May Defeat In Ap Elections

Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishore : ఆంధ్రప్రదేశ్​లో  పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ సంచలన కామెంట్స్ చేశారు.

  • By Pasha Published Date - 05:06 PM, Sun - 12 May 24
  • daily-hunt
Prashant Kishore
Prashant Kishore

Prashant Kishore : ఆంధ్రప్రదేశ్​లో  పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో జగన్​కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ‘నవరత్నాలను’ తానే సూచించానని చెప్పిన పీకే(Prashant Kishore).. గెలిచిన తర్వాత జగన్ వాటిని సరిగ్గా అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. వాటి పర్యవసానం ఎన్నికల ఫలితంలో కనిపిస్తుందని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఎన్నికల్లో ఓటమికి చేరువయ్యారనే విషయాన్ని తాను జగన్‌కు 18 నెలల క్రితమే చెప్పానని పీకే వెల్లడించారు. ‘‘నేను అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాను. ఎందుకు గెలవను. మాకు 155 అసెంబ్లీ సీట్లు వస్తాయి’’ అంటూ జగన్ నాతో వాదించారు. ఆనాటి నుంచి నేటిదాకా మళ్లీ జగన్ ను తాను కలవలేదని స్పష్టం చేశారు. జగన్  పాలనలో ఎన్నో తప్పులున్నాయని, దానివల్ల ఈ ఎన్నికల్లో వైసీపీ భారీగా నష్టపోబోతోందని వెల్లడించారు.  ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా దారి తప్పారు. వాలంటీర్లను నియమించుకోవడం అనేది నా ఆలోచన కాదు. ఆ వ్యవస్థ కారణంగా వైఎస్సార్ సీపీ క్యాడర్ నిర్వీర్యమైంది’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను ఐప్యాక్ కోసం పనిచేయడం లేదని పీకే స్పష్టం చేశారు.

Also Read :Free Electricity : ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ 10 సంచలన హామీలు

‘‘స్జజల రామకృష్ణారెడ్డి లాంటివారు 151 సీట్ల వైఎస్సార్ సీపీని 51 సీట్లకు తీసుకొస్తున్నారు. నేను ఎవరు డబ్బులిస్తే వారిపై మాట్లాడుతానని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తెలుసుకోవాలి’’ ప్రశాంత్ కిశోర్ కామెంట్స్ చేశారు.

Also Read :Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క

‘‘బొత్స టీడీపీలోకి వెళ్లడానికి ఒప్పందం చేసుకున్నారు. గెలిచిన పార్టీలోనే ఉండాలని బొత్స అనుకుంటారు. మూడు రాజధానులకు సంబంధించిన ఆలోచన కూడా నాది కాదు. జగన్ దే ఆ ఆలోచన. 2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత నేను ఇంతవరకు సేవలు అందించలేదు. ఐప్యాక్ మాత్రం ఇప్పటికీ సేవలు అందిస్తోంది’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.

Also Read : Payal Rajput : ఈసారి పోలీసాఫీసర్ గా అదరగొట్టబోతున్న పాయల్ రాజ్‌పుత్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM
  • AP Elections
  • elections 2024
  • lok sabha
  • prashant kishore
  • ys jagan

Related News

Duragamma

Jagan : దుర్గమ్మ ను రోజా ఏం కోరుకున్నదో తెలుసా..?

Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని, అందుకు అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd