X Posts Vs EC : ఈసీ ఆర్డర్.. టీడీపీ, వైఎస్సార్ సీపీల ‘ఎక్స్’ పోస్టులు డిలీట్
X Posts Vs EC : సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెడుతున్న పోస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఫోకస్ చేసింది.
- By Pasha Published Date - 12:55 PM, Wed - 17 April 24
X Posts Vs EC : సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెడుతున్న పోస్టులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఫోకస్ చేసింది. తాజాగా పలు పోస్టులకు సంబంధించి ‘ఎక్స్’ (ట్విట్టర్)కు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నాయకులు పెట్టిన నాలుగు పోస్టులను తొలగించాలని ఎక్స్ కు ఆర్డర్ ఇచ్చింది. ఎన్నికల నోడల్ అధికారుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందనగా ఈసీ ఈమేరకు చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాలు అందగానే ‘ఎక్స్’ ఆ నాలుగు పోస్టులను డిలీట్ చేసింది. అయితే ఆ పోస్టులు భారత దేశంలో మాత్రమే డిలీట్ అవతాయి. ఇతర ప్రపంచ దేశాలలో యథాతథంగా కనిపిస్తాయి. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఈసీ నిషేధించిన విషయం తెలిసిందే. అలాంటి పోస్టులను గుర్తించి, డిలీట్ చేయించే పనిని ఇప్పుడు ఎన్నికల సంఘం(X Posts Vs EC) మొదలుపెట్టింది.
We’re now on WhatsApp. Click to Join
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్లో చేసిన ఒక పోస్టులో సీబీఐకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. వైజాగ్ పోర్ట్ లో 25 వేల కిలోల డ్రగ్స్ సీబీఐ స్వాధీనం చేసుకుందని.. ఏపీ పోలీసులు, పోర్టు ఉద్యోగులు డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడానికి సీబీఐకి సహకారం అందించలేదనే విషయంలో అందులో ఉంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఉందని చంద్రబాబు పెట్టిన పోస్టును కూడా తొలగించాలని ఈసీ ఆదేశించింది. దీంతో ఆయా పోస్టులను తొలగించారు.
- ఈసీ నుంచి ఆదేశాలు అందగానే ‘ఎక్స్’ లోని అధికారిక పేజీలో పెట్టిన ఓ వివాదాస్పద పోస్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.
Also Read :BJP Only 2 : బీజేపీకి 2 సీట్లే.. ‘సివిక్ పోల్’ సంచలన సర్వే నివేదిక
- ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను ఈసీ ఆదేశాల మేరకు ‘ఎక్స్’ తొలగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను పెట్టి దానిపై బాండ్ చోర్ అనే క్యాప్షన్ పెట్టిన పోస్టును కూడా ఎక్స్ డిలీట్ చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ను తొలుత ఈడీ అరెస్టు చేసిందని, ఆ తర్వాతే ఎలక్ట్రోరల్ బాండ్లను అరబిందో ఫార్మా కొనుగోలు చేసిందనే సంచలన ఆరోపణను ఆ పోస్టులో ప్రస్తావించారు.
- బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఎక్స్ అకౌంటు నుంచి ఓ ట్వీట్ ను ఈసీ డిలీట్ చేసింది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడంలో సీజన్డ్ ప్లేయర్ లాంటివాడని ఆ పోస్టులో సామ్రాట్ చౌదరి విమర్శించారు. ఎంపీ టికెట్ల అమ్మకంలో చివరకు కూతురిని కూడా లాలూ వదలలేదని.. ఆమె నుంచి కిడ్నీ తీసుకుని లాలూ టికెట్ ఇచ్చారనే వివాదాస్పద కామెంటును ఆ పోస్టులో సామ్రాట్ చౌదరి ప్రస్తావించారు.
Also Read :Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ
Related News
Sixth Phase Elections : ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Sixth Phase Elections : దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆరో విడత పోలింగ్ కోసం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.