HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Political Heat Peaks In Scorching Summer In Andhra Pradesh

Andhra Politics: ఏపీలో తారాస్థాయికి చేరిన పొలిటిక‌ల్ హీట్‌…!

ఏపీలో రాజ‌కీయ వేడి మొద‌లైంది. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వివిధ కార్యక్రమాలతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది.

  • By Hashtag U Published Date - 12:25 PM, Sat - 28 May 22
  • daily-hunt
Check your Vote
Jagan chandrababu naidu

ఏపీలో రాజ‌కీయ వేడి మొద‌లైంది. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వివిధ కార్యక్రమాలతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. మహానాడు వేదిక నుంచి క్విట్ జ‌గ‌న్, సేవ్ ఏపీ” అంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా విజయసాయిరెడ్డి, ఇతర వైఎస్సార్‌సీ నేతలు హైదరాబాద్‌లో ఉంటున్న చంద్ర‌బాబునాయుడిని శాశ్వతంగా తరిమికొట్టాలంటూ ‘కిక్ బాబు, సేవ్ ఏపీ’ నినాదాన్ని ఇచ్చారు.

గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం కారణంగా టీడీపీ మహానాడు కార్య‌క్ర‌మం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగింది. అందువల్ల పార్టీ కార్యకర్తలను పునరుజ్జీవింపజేయడానికి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ “వైఫల్యాలను” హైలైట్ చేయడానికి, 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు ఈసారి మహానాడును ఘనంగా ప్లాన్ చేశారు.చంద్ర‌బాబు నాయుడు బాదుడే బాదుడు నిరసనలు, బహిరంగ సభలకు శ్రీకారం చుట్టగా అధికార వైఎస్సార్‌సీపీ గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందంటూ నాలుగు రోజులపాటు సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర పేరుతో సరికొత్త రాజకీయ వ్యూహాన్ని రచించింది.

ఏపీలో జనాభాలో 50 శాతం బీసీలు ఉన్నారని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చంద్ర‌బాబునాయుడు కూడా దీనిని కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. గత పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో బీసీలకు చేరువయ్యారు. ఇది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడానికి దోహదపడింది. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు బీసీల మద్దతును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీ ప్రక్రియలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జగన్ మోహన్ రెడ్డి కేబినెట్, ప్రభుత్వం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా జగన్‌పై ప్రజల్లో ఉన్న ప్రాధాన్యత కారణంగా చాలా మంది బీసీలు వైఎస్‌ఆర్‌సి టిక్కెట్‌లపై జనరల్ స్థానాల నుండి ఎన్నికల్లో గెలిచారు. బీసీల కోసం ప్రస్తుత ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ 17 మంది మంత్రులతో వైసీపీ బస్సుయాత్ర ప్రారంభించింది. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పలువురు బీసీ నేతలకు వివిధ పదవులు దక్కిన విషయాన్ని కూడా ఈ యాత్ర హైలెట్ చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ప్రచారంలో వైఎస్సార్సీపీదే పైచేయి అని విశ్లేషకులు చెబుతున్నారు.

మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే మహానాడుకు వ్యతిరేకంగా మే 26 నుంచి నాలుగు రోజులపాటు బస్సు యాత్రను నిర్వహిస్తోంది. ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులకు కూడా సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందజేస్తూ సంతృప్త ప్రాతిపదికన అందరికీ నేరుగా లబ్ధిదారుల బదిలీ (డిబిటి) పథకం కూడా అధికార పార్టీకి మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి వైఎస్‌ఆర్‌సీ నిబద్ధతతో పాటు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బస్సు యాత్రకు మంచి స్పందన వస్తుందని, శనివారం నరసరావుపేటలో బహిరంగ సభ నిర్వహించాలన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Telugu Desam
  • ysrcp

Related News

Pawan Kalyan Fever

Pawan Kalyan: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ — వైద్యుల సూచనలతో విశ్రాంతి

వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం పవన్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు.

  • Minister Nara Lokesh

    AP Fee Reimbursement Dues: ఫీజు రీయింబర్స్ బకాయిలపై వైసీపీ దుష్ప్రచారానికి నారా లోకేష్ కౌంటర్

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd