HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >People Of Ap Want Kcrs Leadership Brs Chief Thota

Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!

దేశంలోనే అగ్రగామిగా నిలిపిన భారాస అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

  • By Balu J Published Date - 05:19 PM, Fri - 21 July 23
  • daily-hunt
Kcr Thota
Kcr Thota

వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్చగా బ్రతకలేని దయనీయ పరిస్తితులు రాష్ట్రంలో నెలకొన్నాయని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ ద్వజమెత్తారు. బిఆర్ఎస్ నాయకులు ఆలమూరు రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా బిజెపి మైనారిటీ మోర్చా జోనల్ ఇంచార్జీ నాగుల్ మీరా,షేక్ రబ్బాని సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించే బిజెపిని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు ఈ క్రమంలో బిజెపిని ఎదుర్కొగల ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమై అభివృద్ది కుంటుబడిందని ఆరోపించారు. టిడిపి ,వైసీపీ పార్టీల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజానీకం వంచనకు గురైందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో భారాస ప్రత్యాన్మయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ది పధంలో నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన భారాస అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి టిడిపి వైసీపీ పార్టీలు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని
తాకట్టు పెడుతూ పబ్బం గడుపుకొంటున్నాయని ఆరోపించారు. ముస్లిం మైనార్టీ వర్గాలపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీ వర్గ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు.

Also Read: Rajagopal Reddy: బండి సంజయ్‌ని చూసి ఏడ్చేశా, రాజగోపాల్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aandhra pradesh
  • AP BRS
  • BRS Chief Thota Chandrasekhar
  • ycp leaders

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd