HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Pawan Kalyan Uses Narsapuram Rally To Lambast Cm Jagan

Pawan Kalyan: నర్సాపురం సభలో ‘జగన్’ పై ‘పవన్’ ఫైర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు.

  • By Hashtag U Published Date - 08:29 PM, Sun - 20 February 22
  • daily-hunt
Pk
Pk

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వమే టార్గెట్ గా పవన్ నిప్పులు చెరిగారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెం. 217ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బహిరంగ సభలో జీవో 217 ప్రతులను చింపి ఆయన నిరసన వ్యక్తం చేశారు. జీవో చింపినందుకు తనను జైలుకు పంపించినా సిద్ధమేనని స్పష్టం చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జనసేన అండగా ఉంటుందని హామీనిచ్చిన పవన్… తాను మాటల వ్యక్తిని కాదని, చేతల వ్యక్తినని అన్నారు. గంగవరంలో జెట్టీ పేరుతో మత్స్యకారులను నిరాశ్రయులను చేశారని జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయానికి మత్స్యకారులు ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

మత్స్యకారుల సమస్యలను చాన్నాళ్లుగా వింటున్నానని తెలిపిన జనసేనాని…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయని పేర్కొన్నారు. 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని వెల్లడించారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ జీవో 217తో లక్షలమంది పొట్టకొడుతుందని ధ్వజమెత్తారు.

మరబోట్లు రాకముందు సముద్రతీరం అంతా మత్స్యకారులదేనన్న పవన్… మరబోట్లు వచ్చాక మత్స్యకారులకు అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. లేని సమస్యను సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని చెప్పారు. సమస్య పరిష్కారం పేరుతో మళ్లీ అనేక ఇబ్బందులు పెడతారని పవన్ గుర్తుచేశారు. మూడేళ్లలో 64 మత్స్యకార కుటుంబాలకే పరిహారం ఇచ్చారని చెప్పారు జనసేనాని. అమలుకాని హామీలు ఎందుకు ఇస్తున్నారని పాలకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు పవన్. చట్టాలు పాటించేలా ముందు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. గంగపుత్రులకు ఇల్లు కట్టుకునేందుకు గతంలో రూ.70 వేలు ఇచ్చేవారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. మత్స్యకారుల కష్టాలు తీరుద్దామనే యోచన వైసీపీ నేతలకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య సమాజంలో ఫ్యూడల్ భావాలు ఉంటే ఎలా అన్న జనసేనాని… మీ పనులను సహనంతో భరిస్తున్నాం.. భయంతో కాదని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇకపోతే, వైసీపీ నాయకుల బెదిరింపులకు జనసైనికులు భయపడరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా కూడా… ఎంతో ఆలోచించి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అక్రమ కేసులతో జనసేన కార్యకర్తలను హింసిస్తే…. తెగించి రోడ్డుపై నిలబడతానని హెచ్చరించారు.
మత్స్యకారుల కోసం జనసేన మేనిఫెస్టోలో ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. తనపై కేసులు పెట్టినా… భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే మత్స్యకారుల కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు సిద్దంగానే ఉన్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

Pawan Kalyan


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh CM
  • fisermen issue
  • janasena chief
  • lambasts jagan
  • Matsyakara Abhyunnati Sabha
  • narsapuram
  • Pawan Kalyan
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

Latest News

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

  • Congress : 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ : మహేష్ కుమార్ గౌడ్

  • Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్‌గా ప్రజ్వల్‌ రేవణ్ణ.. జీతం ఎంతంటే?

  • Ganesh Visarjan 2025: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం… ఇద్దరు మహిళల మృతి

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd