HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Key Comments On Ycp Govt

AP : వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది – పవన్ కళ్యాణ్

  • Author : Sudheer Date : 14-12-2023 - 7:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Own Goal
Pawan Kalyan Own Goal

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారిందని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు.

టీడీపీ పార్టీతో కనీసం పదేళ్లయినా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని .. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే పదేళ్లయినా పొత్తు ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము బీజేపీతో భాగస్వాములుగా ఉండడం వల్ల ముస్లింలు దూరమవుతున్నారని ప్రచారం చేస్తున్నారని .. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకుగా చూడబోనని ఉద్ఘాటించారు. ముస్లింల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి అని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. మీకు అన్యాయం జరిగితే నేను ముస్లింల వైపే ఉంటా… మీ పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే అవుతా అని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికు చెందిన గరికపాటి వెంకట్ ఈరోజు పవన్ సమక్షంలో పార్టీ లో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ ఇలా ఉంటె…పలాస లో సీఎం జగన్ మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్ కంటే బర్రెలక్క బెటర్‌ అని అన్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు, పవన్‌ నాటకాలు ఆడడం పరిపాటిగా మారిందని జగన్ మండిపడ్డారు. తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఇద్దరు నాయకులు కూడా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన వారేనని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోయారని , సొంత నియోజకవర్గాన్ని విస్మరించిన చంద్రబాబు ఉత్తరాంధ్రను ఎందుకు పట్టించుకుంటాడని అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటారు..విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తారంటూ తనదైన శైలిలో జగన్ కామెంట్స్ చేసారు.

Read Also : TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP Assembly elections
  • jagan
  • Pawan Kalyan
  • TDP-Janasena Manifesto

Related News

Anitha Jagan

పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

YCP బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత మండిపడ్డారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తోందని ఆరోపించారు

  • Jagan Birthday Chipurupally

    బొత్స ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

  • Pawan Amaravati

    వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • Nara Lokesh Skill Census Vs

    మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

  • Janasena Meetting

    డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

Latest News

  • టీమిండియాపై బీసీసీఐ కఠిన చర్యలు?

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd