HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Counter To Prakash Raj Comments On The Laddu Controversy

Pawan Kalyan : లడ్డూ వివాదం.. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్‌

Actor Prakash Raj : శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు.

  • Author : Latha Suma Date : 24-09-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan counter to Prakash Raj comments on the laddu controversy
Pawan Kalyan counter to Prakash Raj comments on the laddu controversy

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్‌ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అని ప్రశించారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సెక్యూలరిజం అంటే రెండు మార్గాలని, ప్రకాశ్ రాజు తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. #prakeshraj #AndhraPradeshDeputyCM #Vijayawada #Pawankalyan #temples #HashtagU pic.twitter.com/O3HAToTaPJ

— Hashtag U (@HashtaguIn) September 24, 2024

అంతేకాక.. తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది సరైన విషయం కాదని తేల్చిచెప్పారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలనే అనుసంధానం ఉండాలి కానీ అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ హెచ్చరించారు. తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు. దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు తాను ఎలా నిశ్శబ్దంగా ఉంటానని ఆయన అన్నారు. సనాతన ధర్మంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయకూడదని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే తాను ఊరుకోబోనని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారని, మౌనంగా ఉండకూడదనే భావంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూ, హిందువులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. సెక్యులరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని ఆయన సూచించారు.

వైసీపీ నేతలు నన్ను పచ్చి బూతులు తిట్టినా మౌనంగానే ఉన్నా కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #YSRCP #AndhraPradeshDeputyCM #Vijayawada #Pawankalyan #temples #HashtagU pic.twitter.com/CqY100rFlD

— Hashtag U (@HashtaguIn) September 24, 2024

Read Also: KTR : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: కేటీఆర్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Prakash Raj
  • Deputy CM Pawan Kalyan
  • Ponnavolu Sudhakar Reddy
  • sanatana dharma
  • Tirumala Laddu Issue

Related News

Sanatana Dharma

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని

    Latest News

    • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

    • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

    • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

    • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

    • సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd