HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Officials Are Speedily Restoring Power In The Storm Affected Areas

Andhra Pradesh : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు,

  • By Prasad Published Date - 08:11 AM, Thu - 7 December 23
  • daily-hunt
Power
Power

ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని చాలా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిరంతరంగా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. చెండోడు వద్ద దెబ్బతిన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌కు మరమ్మతులు చేసి సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏపీట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రభావితమైన 17 ఫీడర్‌లలో 10 నుండి సరఫరా పునరుద్ధరించబడింది. మిగిలిన ఏడు ఫీడర్‌లు రేపటికి తిరిగి పనిచేస్తాయని అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో మూడు EHT సబ్‌స్టేషన్లు, 269 33/11 KV సబ్‌స్టేషన్లు, 145 33 KV ఫీడర్లు, 770 33 KV పోల్స్, 12,341 స్తంభాలు, 247 డిటిఆర్‌లు సాధారణ స్థితికి చేరుకున్నాయని APSPDCL సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. 46 మండలాలు, ఏడు పట్టణాల్లోని 1,132 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని.. మొత్తం 12.35 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 150 33 కేవీ సబ్‌స్టేషన్లు, 134 33 కేవీ ఫీడర్లు, 16 33 కేవీ స్తంభాలు, 514 11 కేవీ స్తంభాలు, 17 డీటీఆర్‌లు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృధ్వి తేజ్ తెలిపారు. 77 మండలాల్లోని 1,110 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని… ఇక్క‌డ మొత్తం 5.45 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 204 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 147 33 కేవీ ఫీడర్లు, 115 33 కేవీ స్తంభాలు, 1,247 11 కేవీ స్తంభాలు, 504 డీటీఆర్‌లు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి తెలిపారు. 109 మండలాలు, 11 పట్టణాల్లోని 1,707 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని.. ఇక్క‌డ మొత్తం 19.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు 24 గంటలూ శ్రమిస్తున్న విద్యుత్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోరారు.

Also Read:  AP : మిచౌంగ్ తుఫానుతో గోదావరి జిల్లాల్లో భారీగా పంట న‌ష్టం.. ఆందోళ‌న‌లో రైతులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh power
  • Cyclone Michaung
  • cyclone michaung updates
  • farmers
  • Michaung
  • Power restoration

Related News

Fertilizer Farmers

GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd