HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Role For Regional Parties In National Politics

Modi Effect On YSRCP : మోడీ అలా చేస్తే వైసీపీకి ఎఫెక్టే!

ప్రాంతీయ పార్టీల హ‌వా జాతీయ స్థాయిలో క్రమంగా త‌గ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బ‌కు జాతీయ పార్టీ హోదాను క‌మ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది.

  • Author : CS Rao Date : 25-06-2022 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Before Election
Jagan Modi

ప్రాంతీయ పార్టీల హ‌వా జాతీయ స్థాయిలో క్రమంగా త‌గ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బ‌కు జాతీయ పార్టీ హోదాను క‌మ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ త‌రువాత ఆ స్థాయికి ఏ ప్రాంతీయ పార్టీ ఎద‌గ‌లేదు. అంతేకాదు, ఎదిగే అవ‌కాశం కూడా ప్ర‌స్తుతం క‌నిపించ‌డంలేదు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏ పార్టీకి ఢిల్లీ చ‌క్రం తిప్పేలా ఎంపీల సంఖ్య ఉండే ఛాన్స్ లేదు.

ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ భిన్నంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు సంపూర్ణ మ‌ద్ధ‌తును జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. జాతీయ ప్ర‌త్యామ్నాయం అంటోన్ కేసీఆర్ విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా వైపు ఉన్నారు. ఈ ప‌రిణామం జాతీయ రాజకీయ వేదికపై ప్రాంతీయ పార్టీలు పోషించగల పరిమిత పాత్రలను మరోసారి బహిర్గతం చేసేలా వాళ్లిద్ద‌రూ న‌డిచారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే 1 టైంలో ప్ర‌క‌టించిన రాష్ట్రపతి అభ్యర్థికి 2017లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బేషరతు మద్దతును అందించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడుతున్నారనే విమర్శలను ఆనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్టుబట్టలేదో తెలిపాల‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

సీఎం పదవిలో ఉన్న మొదటి రోజు నుండి మా రాజకీయాలలో (కేంద్రానికి సంబంధించి) మాకు స్పష్టత ఉంది అని జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు చెబుతున్నారు. మోడీ-షా ద్వయం నుండి కొన్ని సానుకూల అంశాల‌ను సాధించిన‌ట్టు చెబుతున్నారు. “ప్రత్యేక హోదా అనేది ముగిసిన‌ అధ్యాయమని అందరికీ తెలుసు. బదులుగా, అదనపు గ్రాంట్లు , రుణాలు పొందడానికి పరపతిని ఉపయోగిస్తున్నాము, ”అని వైసీపీలోని ఒక కీల‌క వ్య‌క్తి స‌మాచారం ఇచ్చారు.

1989, 1996 మరియు 1999లో మూడుసార్లు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఆనాడు ఆ పార్టీ చెప్పిన‌ట్టే జాతీయ రాజ‌కీయాలు న‌డిచాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, BJP ల‌కు 300 కంటే తక్కువ సీట్లు ఉండటం ఆనాడు టీడీపీ కీల‌క. పాత్ర పోషించ‌డానికి అవ‌కాశం ల‌భించింది. 2022 నాటికి రాజ‌కీయ ప‌రిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు BJP 300-ప్లస్ సీట్లను కలిగి ఉంది. అంతేకాదు, కొత్తగా రాష్ట్రాల‌ను జయించటానికి సిద్ధంగా ఉంది.

“2004లో జాతీయ పార్టీల పతనాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ ప‌రిణామాన్ని 2014లో మోడీ (ట్రెండ్) కొత్త స్థాయికి తీసుకెళ్లారు. BJP జాతీయవాద కథనం, మోడీ పాన్-ఇండియా ఇమేజ్ చెక్కుచెదరకుండా ఉండటంతో ప్రాంతీయ పార్టీల పాత్ర మరింత క్షీణిస్తుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా దక్షిణాదిన తెలంగాణ వంటి ప్రాంతాలకు బిజెపి విస్తరణకు దూకుడు పెంచింది. ఫ‌లితంగా ప్రాంతీయ పార్టీల‌ను మరింత బలహీనప‌డే అవ‌కాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లను సాధించిన బిజెపి, అసెంబ్లీలో 37 శాతం వద్ద నిలబ‌డింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సాధించిన 20 శాతం ఓట్లను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది. మోదీ ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడంలో విజయం సాధించినట్లయితే, వైయస్ఆర్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలపై ప్రతికూల ప్రభావం మరింత ఎక్కువగా ఉండేది.

జాతీయ స్థాయిలో ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా వెళితే, ప్రాంతీయ పార్టీల హ‌వా మ‌రింత త‌గ్గిపోయే అవ‌కాశం లేక‌పోలేదు. లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హిస్తే జాతీయ‌తావాదం జాతీయ పార్టీల‌కు క‌లిసొచ్చే అంశం. అందుకే, బీజేపీ ఆ దిశ‌గా ఆలోచిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను మార్చుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp vs ycp
  • pm modi
  • YS Jagan Mohan Reddy
  • ysrcp

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Trump- PM Modi

    యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

  • PM Modi

    పశ్చిమ ఆసియాలో యుద్ధం.. ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

Latest News

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd