HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Question Of Alliance With Tdp Says Bjp

టీడీపీ, బీజేపీ పొత్తుపై అంత‌ర్గ‌త యుద్ధం

తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు.

  • By Hashtag U Published Date - 02:08 PM, Fri - 5 November 21
  • daily-hunt

తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీతో జ‌త క‌ట్టే ప్ర‌స‌క్తేలేద‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు టీమ్ గా ముద్ర‌ప‌డిన బీజేపీలోని సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి, ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి వాళ్లు పొత్తు ఉంటుంద‌ని సంకేతాలు ఇస్తున్నారు. ఈ రెండు వాద‌న‌ల్లో ఏది న‌మ్మ‌శ‌క్య‌మో..తెలియ‌క ఇరు పార్టీల్లోని క్యాడ‌ర తిక‌మ‌క ప‌డుతోంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత పొత్తు అంశంపై తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ క‌లిసి ప‌నిచేశాయ‌ని వైసీపీ అభిప్రాయం. అందుకే, బీజేపీకి 21వేల‌కుపైగా ఓట్లు వ‌చ్చాయ‌ని అంచ‌నా వేస్తోంది. కేవ‌లం 800 ఓట్ల‌కు 2019 ఎన్నిక‌ల్లో ప‌రిమిత‌మైన బీజేపీకి ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌ను పోల్చుతూ బీజేపీకి టీడీపీ ప‌నిచేసింద‌ని జ‌గ‌న్ వ‌ర్గం విమ‌ర్శిస్తోంది. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఓట్లు వేయించింద‌ని సునీల్ దేవ‌ధ‌ర్ అంటున్నారు. ఆ మేర‌కు మీడియా ముఖంగా వెల్ల‌డించాడు. బ‌ద్వేల్ లో కాంగ్రెస్ కు 5వేల ఓట్ల‌కు పైగా వ‌చ్చాయంటే టీడీపీ ఆ పార్టీకి ప‌ని చేసింద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నాడు.

Also Read : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

Also Read : TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?

రాబోవు ఎన్నిక‌ల్లో కింగ్ లేదా కింగ్ మేక‌ర్ గా ఉండాల‌ని ఏపీ బీజేపీ భావిస్తోంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీతో క‌లిసి వెళుతోన్న బీజేపీ,బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో ఒంటరిగా వెళ్లింది. జ‌న‌సేనాని మ‌ద్ధ‌తు లేకుండానే 21వేల‌కు పైగా ఓట్ల‌ను సంపాదించి నైతిక బ‌లాన్ని పోగుచేసుకుంది. ఇదంతా బీజేపీ బ‌లంగా ఆ పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు ఓట్లు వేయించిన‌ప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ ఓట్లు వ‌చ్చాయ‌ని క‌మ‌ల‌నాథులు సంబ‌ర ప‌డుతున్నారు. ఇదంతా క‌మ‌లం పార్టీలోని కొందరు చెబుతున్న మాట‌లు. కానీ, సునీల్ దేవ‌ధ‌ర్ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌రో టీం త‌న వాద‌న‌ను వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి2019 ఎన్నిక‌ల త‌రువాత సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, సీఎం ర‌మేష్‌,గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు బీజేపీలోకి వెళ్లారు. ఆ పార్టీకి రాజ్య‌స‌భ‌లో ఉన్న ఐదుగురిలో క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ మిన‌హా మిలిగిన న‌‌లుగురు ఒకేసారి బీజేపీలోకి వెళ్లారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు సాక్షిగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆనాటి నుంచి భౌతికంగా వాళ్లు బీజేపీలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకు ట‌చ్ లో ఉన్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. వాళ్ల వ్యాపార సామ్రాజ్యాల‌ను కాపాడుకోవ‌డం కోసం వెళ్లార‌ని ప్రత్య‌ర్థులు చెబుతుంటారు. మ‌ళ్లీ సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి టీడీపీలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం కూడా ఉంది. ఆ న‌లుగురు టీమ్ మాత్రం రాబోవు రోజుల్లో బీజేపీ,టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌ను పొత్తు దిశ‌గా తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే, పొత్తుకు సానుకూలంగా వాళ్లు స్పందిస్తున్నార‌ని బీజేపీలోని బ‌ల‌మైన వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.మొత్తం మీద తెలుగుదేశం, బీజేపీ పొత్తు అంశం క‌మ‌లాథుల మ‌ధ్య ఉన్న అభిప్రాయ‌భేదాల‌ను బ‌య‌ట‌పెడుతోంది. రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో ఇప్ప‌టికిప్పుడు తెలియ‌న‌ప్ప‌టికీ…చ‌ర్చ‌కు మాత్రం ఆస్కారం ఇచ్చింది. అధిష్టానం మాత్ర‌మే పొత్తును నిర్ణ‌యిస్తుంద‌ని చంద్ర‌బాబు టీమ్ క‌మ‌నాథులు అంటున్నారు. బీజేపీ అధిష్టానం మ‌నోభావాల మేర‌కు సునీల్ దేవ‌ధ‌ర్ చెబుతున్నార‌ని బాబు వ్య‌తిరేకంగా ఉన్న బీజేపీ ఏపీ నేతలు అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రి చెప్పేది నిజమో..వేచిచూడాల్సిందే.

Also Read : Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh news
  • ap bjp
  • sunil deodhar
  • tdp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd