Nandamuri Balakrishna: ఎన్నికల వేళ.. బాలయ్య ‘పొలిటికల్’ ఫ్లేవర్ మిస్సింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలకృష్ణ మూవీ పొలిటికల్ ప్లేవర్ మిస్ కానుంది.
- By Balu J Published Date - 05:25 PM, Sat - 8 July 23
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీనుల కలయికను అభిమానులు ఆరాధిస్తారు. ఎందుకంటే ఈ జంట 100% సక్సెస్ రేటును సాధించింది. “అఖండ” సినిమాలో బాలకృష్ణ చెప్పిన ప్రభావవంతమైన డైలాగ్స్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు బాగా హెల్ప్ అయ్యాయి. నాయకుల్లో కొంత ఉత్సాహం కూడా నింపింది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ అవకాశం ఉండకపోవచ్చు.
అయితే బాలకృష్ణ ఈసారి రాజకీయ నేపథ్యంతో సినిమాని రూపొందించలేడు. అతను ఇప్పటికే దర్శకుడు బాబీ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యాడు. బోయపాటి 2024 వరకు స్టార్తో కలిసి పనిచేయడు, అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. ఈ సమయంలో బాలకృష్ణ రాజకీయ సినిమా తీయడం దాదాపు కష్టమేనని సన్నిహితులు సూచిస్తున్నారు.
అతను నిజంగా రాజకీయ చిత్రాన్ని రూపొందించాలనుకుంటే రామ్ “స్కంద”ని త్వరగా పూర్తి చేసి, బోయపాటిపై ఒత్తిడి తెచ్చినట్టయితే సాధ్యపడేది. కానీ బాలకృష్ణ, దర్శకుడు బాబీల సినిమాలో కూడా పొలిటికల్ డైలాగులు ఉండవు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “భగవంత్ కేసరి” చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందువల్ల, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలకృష్ణ రాజకీయ సందేశం ఇవ్వడం లేదు. అంటే తెలుగు తముళ్లకు ఓ విధంగా నిరాశే అని చెప్పక తప్పదు.
Also Read: Rashmika & Vijay: షాకింగ్.. రష్మిక, విజయ్ దేవరకొండ విడిపోయారా, ఇన్ స్టా పోస్ట్ వైరల్
Related News
AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్
ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.