HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Narendra Modi Will Speak Abou Ys Viveka Case

Narendra Modi : వివేకా కేసు గురించి మోడీ మాట్లాడతారా?

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న ఎన్నికల సంఘం ఏపీలో లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  • By Kavya Krishna Published Date - 01:25 PM, Fri - 19 April 24
  • daily-hunt
Modi (3)
Modi (3)

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న ఎన్నికల సంఘం ఏపీలో లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను వేస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం సైతం కసరత్తు చేస్తోంది. అయితే.. వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించాలనే దృఢసంకల్పంతో ఉన్న టీడీపీ కూటమి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అధికార వైసీపీ పార్టీ అధికారంలో ఉండి చేసిన తప్పులు, అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లేందుకు టీడీపీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. కొన్ని చోట్ల వైసీపీ నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత వారి జీవనం ప్రశ్నార్థకంగా మారిందని పలువరు కార్మికులు బాహాటంగా అధికార వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ అధికార దుర్వినియోగం చేసిందని, అధికారం దాహాంతో చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకే చుట్టుకునేలా ఉన్నాయని స్థానిక మేధావుల అభిప్రాయం. అయితే.. వైసీపీని అష్టదిగ్భంధనం చేసేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి రావాలనే ఆశతో చేసిన వైసీపీ చేసిన తప్పులను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఓ ఆయుధాన్ని ఎంచుకోనుందని తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ, ఎన్డీయే కూటమిల కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గత నెలలో ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పర్యటించారు. తాజా నివేదికల ప్రకారం, TDP- JSP- BJP కూటమికి ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు భారీ బహిరంగ సభలలో మోడీ పాల్గొంటారు. ఇందులో రెండు సభలు అనకాపల్లి, రాజమండ్రిలో జరగనున్నాయి. మరో రెండు వేదికలు ఖరారు కావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వేదికలలో కడప లేదా రాజంపేట ఒకటి అని మేము వింటున్నాము. పెండింగ్‌లో ఉన్న వేదికలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశాలకు నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. కాగా, గత నెలలో తాడేపల్లిగూడెంలో మోదీ నిరాశపరిచే ప్రసంగం చేశారని ఏపీలోని ఓ వర్గం భావించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన వైసీపీ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉన్న మోడీ ఈసారి కడప పర్యటనకు వచ్చినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, పొత్తు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్‌తో రహస్య పొత్తు పెట్టుకోలేదని తేటతెల్లం చేసేందుకు కూడా ఇది పనికి వస్తుంది. అయితే.. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనపై టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : CM Jagan : వైసీపీ పేద అభ్యర్థికి 161 కోట్ల ఆస్తులు.. జగన్‌ అంటే అంతే మరీ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • bjp
  • JSP
  • narendra modi
  • tdp
  • ys vivekananda case

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • PM Modi Degree

    Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • We have distanced ourselves from India..Trump's key comments

    Trump : ‘భారత్‌కు దూరమయ్యాం’..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

    Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

Latest News

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd