Narendra Modi : వివేకా కేసు గురించి మోడీ మాట్లాడతారా?
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న ఎన్నికల సంఘం ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
- By Kavya Krishna Published Date - 01:25 PM, Fri - 19 April 24
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న ఎన్నికల సంఘం ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను వేస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం సైతం కసరత్తు చేస్తోంది. అయితే.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే దృఢసంకల్పంతో ఉన్న టీడీపీ కూటమి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అధికార వైసీపీ పార్టీ అధికారంలో ఉండి చేసిన తప్పులు, అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లేందుకు టీడీపీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. కొన్ని చోట్ల వైసీపీ నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత వారి జీవనం ప్రశ్నార్థకంగా మారిందని పలువరు కార్మికులు బాహాటంగా అధికార వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ అధికార దుర్వినియోగం చేసిందని, అధికారం దాహాంతో చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకే చుట్టుకునేలా ఉన్నాయని స్థానిక మేధావుల అభిప్రాయం. అయితే.. వైసీపీని అష్టదిగ్భంధనం చేసేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి రావాలనే ఆశతో చేసిన వైసీపీ చేసిన తప్పులను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఓ ఆయుధాన్ని ఎంచుకోనుందని తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ, ఎన్డీయే కూటమిల కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గత నెలలో ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా పర్యటించారు. తాజా నివేదికల ప్రకారం, TDP- JSP- BJP కూటమికి ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు భారీ బహిరంగ సభలలో మోడీ పాల్గొంటారు. ఇందులో రెండు సభలు అనకాపల్లి, రాజమండ్రిలో జరగనున్నాయి. మరో రెండు వేదికలు ఖరారు కావాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న వేదికలలో కడప లేదా రాజంపేట ఒకటి అని మేము వింటున్నాము. పెండింగ్లో ఉన్న వేదికలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సమావేశాలకు నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. కాగా, గత నెలలో తాడేపల్లిగూడెంలో మోదీ నిరాశపరిచే ప్రసంగం చేశారని ఏపీలోని ఓ వర్గం భావించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన వైసీపీ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉన్న మోడీ ఈసారి కడప పర్యటనకు వచ్చినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, పొత్తు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్తో రహస్య పొత్తు పెట్టుకోలేదని తేటతెల్లం చేసేందుకు కూడా ఇది పనికి వస్తుంది. అయితే.. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనపై టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : CM Jagan : వైసీపీ పేద అభ్యర్థికి 161 కోట్ల ఆస్తులు.. జగన్ అంటే అంతే మరీ..!
Related News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.