Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
- By Sudheer Published Date - 02:09 PM, Thu - 15 February 24
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ఓ 420 అలానే సజ్జల 840 అని అని మండిపడ్డారు. ఇక 420 జగన్ కి 840 సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడని.. కాని ఒక్కటి పనికొచ్చే సలహా ఇవ్వరని ఎద్దేవ చేశారు.రామకృష్ణారెడ్డి సలహా మేరకు వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను టీడీపీ గెలిచిందని.. ఆ సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అసలు వీళ్ళు మా ఓటర్లే కాదన్నారని.. అయితే ఆ సమయంలో ఆయనలా ఎందుకన్నారో అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతుందని.. దొంగ ఓట్లు ఎక్కించి రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ”ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపునకు కారణం దొంగ ఓట్లే. వాటిని నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆనాడే చెప్పా. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తుంది.. వారంతా ఇక జైలుకే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు” అని లోకేష్ హెచ్చరించారు.
Read Also : YS Sharmila : మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? – వైస్ షర్మిల
Tags
Related News
Zero Impact : వైసీపీది దింపుడు కళ్లెం ఆశలేనా..?
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది.. అందరూ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ- జేఎస్పీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.