Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
- By Sudheer Published Date - 11:01 AM, Mon - 18 December 23
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో లోకేష్ యువగళం (Nara Lokesh Yuvagalam) పాదయాత్ర ముగుస్తుంది. విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పూర్తి అవుతుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ నెల 20 భోగాపురం లో యువగళం ముగింపు సభ అట్టహాసంగా జరగబోతుంది. ఇప్పటికే ఈ సభ కు సంబదించిన పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ ముగింపు సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్యకర్తలు , అభిమానులు హాజరుకాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులు , ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకావాల్సి ఉంది..కానీ చివరి నిమిషంలో ఆయనకు వేరే కార్యక్రమాలు ఉండడంతో సభకు హాజరుకాలేకపోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. త్వరలో జరగబోయే టీడీపీ – జనసేన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరు అవుతానని తెలిపారు. ఇదిలా ఉంటె నిన్న రాత్రి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు..హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఉమ్మడి కార్యక్రమాల గురించి , అభ్యర్థుల ఎన్నికల , పొత్తులు తదితర అంశాల ఫై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. మొదటిసారి చంద్రబాబు తన ఇంటికి రావడం పట్ల పవన్ సంతోషం వ్యక్తం చేసారు.
Read Also : Kerala To Dubai : కేరళ టు దుబాయ్ క్రూయిజ్ సర్వీసు.. విమానయానం కంటే చౌక!
Related News
Nara Brahmani : లోకేష్కు మంగళగిరిని విడిచిపెట్టమని చాలా సలహాలు ఇచ్చారు
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు.