Montha Cyclone : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Montha Cyclone : మొంథా తుపాన్ కారణంగా భారీగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటన మొదలుపెట్టారు.
- By Sudheer Published Date - 04:30 PM, Wed - 29 October 25
మొంథా తుపాన్ కారణంగా భారీగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటన మొదలుపెట్టారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా నమోదైన బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ నష్టం అంచనా వేయనున్నారు. తుఫాన్ తీవ్రత, మౌలిక సదుపాయాల దెబ్బతినడం, ప్రజల ఇబ్బందుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పర్యటన ఏర్పాటు అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ, సీఎం నేరుగా పరిశీలించడం ద్వారా మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా సీఎం హెలికాప్టర్ ప్రయాణిస్తూ వరదల తీవ్రతను అధ్యయనం చేస్తున్నారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు వద్ద ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పర్యటించి వర్షాలకు నీట మునిగిన గ్రామాలు, రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, చెరువులు–కాలువల ప్రమాద స్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఈ సందర్శన ద్వారా అక్కడి ప్రజలకు ఊరటనిచ్చేలా, ప్రభుత్వం తమతో ఉందనే నమ్మకం కలిగించేలా సీఎం చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
తుపాన్ కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్న రైతులను వ్యక్తిగతంగా కలసి పరామర్శించనున్నారు. పంటలు నీటమునగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఆర్థిక నష్టంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అత్యవసర సహాయక చర్యలు, పంట నష్టం పరిహారం, పునరుద్ధరణ కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు సీఎం తక్షణ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా సీఎం స్పష్టం చేస్తున్నారు.
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu conducts an Aerial Survey of the damage caused by the Cyclone Mondha.#CycloneMontha #MonthaCyclone#Montha #ChandrababuNaidu #Cyclone #AndhraPradesh pic.twitter.com/XE334BaUEN
— Surya Reddy (@jsuryareddy) October 29, 2025