TDP vs YCP : పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో సంసారం చేసేవాడు దేవినేని ఉమా.. శవాల దగ్గర చిల్లర రాజకీయమా..?
మైలవరంలో రాజకీయం హాట్హాట్గా సాగుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఉనికిని కాపాడుకునేందుకు
- By Prasad Published Date - 07:23 AM, Thu - 23 November 23
మైలవరంలో రాజకీయం హాట్హాట్గా సాగుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉమా ఆరోపణలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ఇటీవల దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బహిరంగ సవాల్ చేశారు. నువ్వు నేనూ చూసుకుందాం దా.. దేనికైనా సిద్ధమేనంటూ కృష్ణప్రసాద్ సవాల్ చేశారు. నందిగామ మండలం ఐతవరంలో తమ సొంత మనిషి గణేష్ మునేరులో నీటిలో మునిగిన ప్రమాదంలో చనిపోతే తాను.. తమ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దీన్ని కూడా దేవినేని ఉమా రాజకీయం కోసం వాడుకున్నాడని.. ఆ గోతులు ఇసుక అక్రమ రవాణా కోసం దేవినేని ఉమా హయాంలో తవ్వినవేనని ఎమ్మెల్యే ఆరోపించారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో కోటి ఇటుకల పథకం పెట్టి నిరుపేదలకు, ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఉచితంగా ఇటుకలు ఇచ్చానని ఆయన తెలిపారు. తాను దేవాలయాలకు, చర్చిలకు, ప్రార్ధన మందిరాలకు విరాళాలు ఇస్తానని.. దేవినేని ఉమాకు చేతనైతే ఆయన కూడా ఇవ్వాలని సవాల్ చేశారు. అసలు దేవినేని ఉమా ఏనాడైనా ఎవరికైనా విరాళాలు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
దేవినేని ఉమా అనే వాడు మలపత్రాష్టుడు, నికృష్టపు వెదవ అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విటీపీఎస్ బూడిద విషయంలో కూడా అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు బూడిదను బ్రిక్స్, సిమెంట్ కంపెనీలకు, జాతీయ రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. లోకల్ ట్రాన్స్ పోర్టర్ కోయ వెంకట్రావు తన దగ్గరకు వస్తే తాను కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విటీపీఎస్ వారిని కోరానని.. దీన్ని కూడా తనకు అపాదించి దేవినేని ఉమా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో దేవినేని ఉమా సంసారం చేస్తారని.. డబ్బుల కోసం చీకటి ఒప్పందాలు బాగానే చేస్తారని ఆరోపించారు. దేవినేని ఉమా చేసేవన్ని లోపాయికారి ఒప్పందాలేనని.. చేసేవన్నీ చేసి పైకి మాత్రం ఆరోపణలు చేస్తుంటారని తెలిపారు.
Also Read: Vijayashanti : కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుంది – విజయశాంతి
మీడియా ముఖంగా దేవినేని ఉమాకు ఛాలెంజ్ చేస్తున్నానని… తాను తన ముగ్గురు అక్కలను తీసుకుని వస్తానని.. దేవినేని ఉమా సోదరీమణులను కూడా తీసుకొని రావాలని సవాల్ చేశారు.. తాను తన ముగ్గురి అక్కల ఆస్తులను నేను కొట్టేసినట్లు దేవినేని ఉమా చేస్తున్న ప్రచారంలో నిజం ఎంతో బహిరంగంగానే తేల్చుకుందామన్నారు. దేవినేని రమణ గారి కూతురు పెళ్ళి అమెరికాలో జరిగితే కనీసం ఇక్కడ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయని వ్యక్తి ఉమానని.. కనీసం రమణ గారి అభిమానుల కోసమైన సరే ఇక్కడ వారి బిడ్డల ఫంక్షన్ ఏ ఒక్కటి నిర్వహించలేదన్నారు.. దేవినేని ఉమా తండ్రి చనిపోయిన తరువాత కూడా క్రతువు నిర్వహించిన వాళ్లకు, దినం కార్డులు పంచిన వాళ్లకు, పాలు, పెరుగు బక్కెట్లకు కూడా డబ్బులు ఇవ్వలేని కక్కుర్తి వెధవంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమాకు లాగా తాను చిల్లర పనులు చేయనని.. తనదంతా రహదారేనని తెలిపారు. తానేనెప్పుడైనా సరే ప్రజాల్లోనే తేల్చుకుంటానన్నారు. నాలుక చేసిన తప్పుకు వీపుకు వాసిపోద్ది. ఇది దేవినేని ఉమా గుర్తించాలి. నేను ముందు ఏమి అనను. నువ్వు ఒకటి అంటే నేను పది అంటా. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదటూ వార్నింగ్ ఇచ్చారు.
Related News
Shyamala Devi : జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ.. నరసాపురంలో గెలుపు పక్కా..
నేడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున పాల్గొన్నారు.