Murder: కోడలి తలనరికి…తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అత్త…!!
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కోడలి తలనరికి చంపిన అత్త...కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి...పోలీసుల ఎదుట లొంగిపోయింది.
- By hashtagu Published Date - 05:52 PM, Thu - 11 August 22
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కోడలి తలనరికి చంపిన అత్త…కోడలి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి…పోలీసుల ఎదుట లొంగిపోయింది. అంతేకాదు తన కోడలిని తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట నిర్భయంగా నేరాన్ని అంగీకరించింది.
రాయచోటి మండలం కె.రామాపురంలో సుబ్బమ్మ నివసిస్తోంది. కోడల వసుంధరతో ఆమెకు కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం ఆవేశంతో ఊగిపోయిన అత్త సుబ్బమ్మ…కోడలు వసుంధరపై దాడికి పాల్పడింది. కత్తి తీసుకుని వసుంధర తలను నరికేసింది.
తెగి పడిన కోడలు వసుంధర తలను చేత పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన కోడలిని తానే హత్య చేశానని పోలీసులకు చెప్పింది. కోడలి తలతో సుబ్బమ్మ అలా నడుచుకుంటూ..వెళ్తుంటే జనం భయభ్రాంతులకు గురయ్యారు.
Related News
AP Pension: ఏపీలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త
మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ సొమ్మును జమ చేయనున్నారు