Rajahmundry Central Jail : రాజమండ్రి జైలు చుట్టూ దోమల ఫాగింగ్
చంద్రబాబు ఉంచిన సెల్ లో దోమల బెడద ఎక్కువగా ఉందని, గతంలో దోమ కాటు వల్ల ఖైదీలు చనిపోయిన ఘటనలు గుర్తు చేస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు
- By Sudheer Published Date - 01:48 PM, Thu - 28 September 23
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి ..రాజమండ్రి సెంట్రోల్ జైల్లో (Rajahmundry Central Jail) ఉంచిన సంగతి తెలిసిందే. గత 19 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందని, ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఉంచిన సెల్ లో దోమల (Mosquito ) బెడద ఎక్కువగా ఉందని, గతంలో దోమ కాటు వల్ల ఖైదీలు చనిపోయిన ఘటనలు గుర్తు చేస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఆరోపణలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతుండగా వైసీపీ వర్గాలు ప్రత్యారోపణలతో కౌంటర్ ఇస్తున్నారు. ఈ దోమల గొడవ చిలికి చిలికి గాలివానగా మారే సూచనలు కనిపించడంతో జైలు అధికారులు చర్యలు చేపట్టారు.
జైలు చుట్టూ అధికారులు పెద్దఎత్తున దోమల ఫాగింగ్ (Mosquito fogging ) చేయించారు. దోమల బెడద తగ్గించడానికి ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గడిచిన 18 రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్ జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో వృక్షాలు, మొక్కలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు. జైలు ప్రాంగణంతోపాటు.. పరిసరాల్లోని చెట్లు పుట్టలు, పొదల్లో కూడా మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు.
Read Also : Floods: ఎందుకీ వరదల ముప్పు..? ఎవరిది తప్పు..?
Related News
AP : మహిళలపై దాడులు చేస్తున్న పట్టించుకోని ఏపీ పోలీస్ – చంద్రబాబు
టీడీపీ నేతలపైనే కాదు కార్యకర్తలపై కూడా దాడులకు తెగపడుతున్నారు. పల్నాడు, తిరుపతి , అనంతపురం , తాడిపత్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసిన వైసీపీ రౌడీ మూక..ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ ను కూడా వదలడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వాపోయారు