MLC Shaik Sabji : ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రమాదంలో చనిపోలేదు..హత్య చేసారు – కుటుంబ సభ్యుల ఆరోపణ
- By Sudheer Published Date - 11:21 AM, Sat - 16 December 23

శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టడం తో సాబ్జీ కన్నుమూశారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ ప్రమాదంపై కుటంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం కాదని.. పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి అంతమొందించాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే రాంగ్ రూట్లో వచ్చి.. ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి సాబ్జీని హత్య చేశారని చెబుతున్నారు. 140 కిలో మీటర్ల వేగంతో వాహనం వచ్చి కారును ఢీకొట్టినట్లు పోలీసులే చెబుతున్నారని..తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ఎవరో కుట్రపూరితంగా పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆరోపించారు. మృతదేహానికి పోస్ట్మార్టం చేసి బయటికి తీసుకువచ్చాక కూడా రక్తం కారుతోందని.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనన్నారు. తన తండ్రి ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం కూడా సక్రమంగా చేయలేదని.. ప్రమాదానికి కారణమైన వారిని తప్పించేలా పోలీసుల విచారణ ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రమాదానికి కారణమైన కారు నంబర్ చెప్పారే తప్ప.. ప్రమాదానికి కారకులైన వారి వివరాలు మాత్రం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కారు నంబర్ వెల్లడించారు కానీ నిందితులు ఎక్కడికి వెళ్లారు. ఎంత మంది ఉన్నారు అనేది మాత్రం ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ పక్కన ఉన్న తన తండ్రి మాత్రమే చనిపోయేలా.. ప్లాన్ ప్రకారమే తప్పుడు మార్గంలో వచ్చి యాక్సిడెంట్ చేసినట్లు సాబ్జీ కుమారుడు ఆజాద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ, షాకైన జనాలు