HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Minister Rk Roja Fires On Tdp Leaders Over Mlc Election Results

Minister Rk Roja: టీడీపీది పగటికలే.. ప్రజలు జగనన్నని మరోసారి కోరుకుంటున్నారు: మంత్రి రోజా

ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఇప్పటికే ఆయా పార్టీలు

  • By Anshu Published Date - 06:10 PM, Tue - 21 March 23
  • daily-hunt
Minister Rk Roja
Minister Rk Roja

ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాయి. కాగా వచ్చే ఎన్నికలలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది అంతే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జనసేన విషయం పక్కన పెడితే టిడిపి వైసిపి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ప్రభంజనం సృష్టించడంతో వచ్చే ఏడాది కచ్చితంగా టిడిపి నే గెలుస్తుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వైసిపి మంత్రి రోజా రాజాగా తిరుపతి మీడియాతో మాట్లాడుతూ టిడిపి పార్టీ గురించి టిడిపి నాయకుల గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న వన్స్ మోర్ అని అంటున్నారు. వచ్చే ఏడాది అధికారంలోకి వస్తాము అనేది టిడిపి పగటి కలే అని తెలిపింది రోజా. 2019 నుండి ఎక్కడ గెలవకపోవడంతో టిడిపి నాయకులు పిచ్చెక్కిపోయారు. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టిడిపికి అనుకోకుండా కేవలం 3 ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చాయి. ఎమ్మెల్సీలు సొంత ఓట్లు సింబల్ తో గెలవలేదు అయినా పెద్దగా ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తెలిపింది.

కానీ వాళ్ళ అహంకారం కలిగిన నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ కులానికి చెందిన స్పీకర్ ను అవమానించి దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు అంటూ ఆమె ప్రశ్నించింది. అలాగే చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం మా నాయకుల పై నిందలు వేయడం సిగ్గుచేటు అని అన్న ఆయన టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ జాతి వాళ్లకు పదవులు ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం చాలా దురదృష్టకరం అని తెలిపింది రోజా. జీవో నెంబర్ వన్ కోసం తీర్మానం ఇచ్చిన టిడిపి ఎప్పుడైనా ప్రజల సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా అని రోజా నిలదీసింది. వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తే ఏం జరగదు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటికలే అని తెలిపింది రోజా. కాకుండా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని హెచ్చరించింది మంత్రి రోజా.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • minister RK ROJA
  • mlc elections
  • tdp
  • tirupathi

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd