Nara Lokesh : ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే చంద్రబాబు అరెస్ట్ – నారా లోకేష్
కేవలం రాజకీయ కక్ష్య తోనే చంద్రబాబు ను అరెస్ట్ చేసి..28 రోజులుగా జైల్లో ఉంచారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, ప్రజల కోసం పోరాడిన పాపానికి ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు
- By Sudheer Published Date - 08:29 PM, Fri - 6 October 23

రాష్ట్రంలో ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు (Chandrababu) ను ఈరోజు తన తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రహ్మణితో కలిసి నారా లోకేష్ చంద్రబాబుతో ములాకత్ (Chandrababu Mulakat) అయ్యారు.
అనంతరం మీడియా తో లోకేష్ మాట్లాడారు. కేవలం రాజకీయ కక్ష్య తోనే చంద్రబాబు ను అరెస్ట్ చేసి..28 రోజులుగా జైల్లో ఉంచారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, ప్రజల కోసం పోరాడిన పాపానికి ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పటికీ చంద్రబాబు భద్రత పై అనుమానాలు ఉన్నాయి.. ఎస్పీకి మావోయిస్టులు లేఖరాసారు.. ఇదే జైలులో మావోలు వుండటంతో చంద్రబాబు భత్రతపై అనుమానాలు కలుగుతున్నాయని లోకేష్ అన్నారు. ప్రజల తరఫున పోరాడినందుకు చంద్రబాబును కక్ష కట్టి వ్యవస్థల్ని మెనేజ్ చేసి ఈ జగన్ ప్రభుత్వం జైలుకు పంపారని లోకేష్ ఆరోపించారు. ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ పార్టీ (TDP Party) అధికారంలో ఉన్నా .. లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రజల తరఫున పోరాడమని మా చంద్రబాబు చెప్పారు. శాంతియుతంగా పోరాటాలు చేయాలని సూచించారని అలాగే మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఇక, మొదట్లో మూడు వేల కోట్లు అవినీతి అన్నారు. తర్వాత 300 కోట్లు.. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు.. రేపు 0 అంటారు అని లోకేష్ దుయ్యబట్టారు.
Read Also : Nara Lokesh : నారా లోకేష్ టంగ్ స్లిప్ అవ్వడంతో.. థాంక్స్ చెప్పిన మంత్రి రోజా