బాలయ్యా..దయచేసి చంద్రబాబు రొచ్చులో పడకండి- లక్ష్మీపార్వతి
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై అటు టీడీపీ ఇటు వైసీపీ వరుస ప్రెస్మీట్లు పెడుతున్నారు. బాలయ్య కుటుంబం చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి కూడా మొదటిసారి స్పందించారు.
- By Hashtag U Published Date - 04:48 PM, Sat - 20 November 21
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై అటు టీడీపీ ఇటు వైసీపీ వరుస ప్రెస్మీట్లు పెడుతున్నారు. బాలయ్య కుటుంబం చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి కూడా మొదటిసారి స్పందించారు. మామను ముప్పతిప్పలు పెట్టి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నమ్మద్దని బాలయ్యకు హితవు పలికారు. తన స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు కుటుంబం మొత్తాన్నీ రోడ్డుకి ఈడ్చారని అన్నారు.
దొంగ ఏడుపులు ఏడుస్తూ చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారని అన్నారు లక్ష్మీపార్వతి. కనీసం పురంధేశ్వరి అయినా బాబు నాటకాన్ని గమనించాలన్న లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పేరును వాడుకుని మళ్లీ జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
Also Read : `వ్యక్తిత్వ హనన` ఈనాటిది కాదు..!
జగన్ ఎప్పుడూ కూడా ఆడవారి గురించి తప్పుగా మాట్లాడలేదని, నిజంగానే చంద్రబాబు అన్నారని చెబుతున్న మాటలు వైసీపీ నేతలు అని ఉంటే తాను కూడా దాన్ని తప్పకుండా ఖండిస్తానని అన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. కావాలంటే బాలయ్యకు ఓపెన్ లెటర్ రాస్తానన్న లక్ష్మీపార్వతి, కుటుంబసభ్యులను మరోసారి ఆలోచించాలని కోరారు. చంద్రబాబే ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద శతృవు అన్నారు లక్ష్మీపార్వతి. పురందేశ్వరి, బాలయ్య, భువనేశ్వరి మరోసారి పునరాలోచించుకోవాలని, నందమూరి కుటుంబం వెంట తాను ఉంటానని అన్నారు.అటు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై కూడా లక్ష్మీపార్వతి స్పందించారు. చిన్నతనంలో నీ తల్లిని ఎంత క్షోభ పెట్టారో నీకు తెలియదు. అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.
Related News
Jhanvi Kapoor: దేవరపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్?
జాన్వీ కపూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు