HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kothapalli Subbarayudu To Rejoin Tdp

Kothapalli SubbaRayudu : టీడీపీ గూటికి `పాత కాపు కొత్త‌ప‌ల్లి`?

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు.

  • Author : Hashtag U Date : 02-06-2022 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Kothapalli Subbarayudu
Tdp Kothapalli Subbarayudu

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ట‌చ్ లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన వైసీపీ ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఎలాంటి నోటీసులు జారీ చేయ‌కుండా ఆయ‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకుంది. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోని ప‌నిచేసిన ఆయ‌న గోదావ‌రి జిల్లాల్లో బ‌ల‌మైన నాయకుడు. చంద్ర‌బాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన త‌రువాత మారిన ఈక్వేష‌న్ల క్ర‌మంలో టీడీపీని వీడారు.

1981లో ఇండిపెండెంట్‌గా నరసాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచిన సుబ్బారాయుడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు. మధ్యలో ఒకసారి నరసాపురం ఎంపీగానూ గెలిచారు. కీల‌క లీడ‌ర్ గా ఎదిగిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు 2009లో చిరంజీవిని న‌మ్ముకుని రాజ‌కీయంగా మునిగిపోయారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టేస‌రికి 2009లో పీఆర్పీలో చేరిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా డార్క్ లోకి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ పార్టీ పీఆర్పీలో విలీనం త‌రువాత 2011లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌రువాత 2014లో వైపీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి గుడ్‌బై చెప్పి చంద్రబాబు చెంత‌కు చేరారు. కీల‌క‌మైన‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆయ‌న‌కు చంద్ర‌బాబు అప్ప‌గించారు. వివిధ ఈక్వేష‌న్ల న‌డుమ 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌కుండా ఆయ‌న్ను ప‌క్క‌న బెట్ట‌డంతో వైసీపీ త‌రపున న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కు మ‌ద్దతు ప‌ల‌క‌డం ద్వారా తిరిగి జ‌గ‌న్ గూటికి చేరారు. ఆనాటి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఒంగోలులో జరిగిన మ‌హానాడు హిట్ కావ‌డంతో టీడీపీ పెద్ద‌ల‌కు ట‌చ్ లోకి వెళ్లాడ‌ని టాక్‌. అందుకే, సుబ్బారాయుడుపై వైసీపీ స‌స్పెండ్ వేసింద‌ని తెలుస్తోంది.

స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మేమిటో చెప్పాల‌ని, లేనిప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానంటూ వైసీపీకి కొత్తప‌ల్లి అల్టిమేటం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీపై ఒక్క మాట కూడా అన‌లేద‌న్న కొత్త‌ప‌ల్లి, ఏ త‌ప్పు చేయ‌కుండానే పార్టీ వేటు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎందుకు సస్పెన్ష‌న్ వేటు వేయ‌డం లేద‌ని నిల‌దీశారు.స‌స్పెన్ష‌న్‌కు గ‌ల కార‌ణాల‌ను మీడియాకు విడుద‌ల చేయాల‌ని, లేదంటేచ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు.

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న. కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ఇటీవ‌ల జరిగిన జిల్లాల విభ‌జ‌న విష‌యంలో త‌న పంథాను
నెర‌వేర్చుకోలేక‌పోయారు. భీమవ‌రం కేంద్రంగా ఏర్ప‌డిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాను ఆయ‌న వ్య‌తిరేకించారు. జిల్లా కేంద్రంగా న‌ర‌సాపురంను చేయాల‌ని డిమాండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సానుకూల స్పంద‌న లేక‌పోవ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చి త‌ప్పుచేశాన‌ని త‌న చెప్పుతో తాను కొట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆనాటి నుంచి పార్టీ హైక‌మాండ్ ఆయ‌న‌పై గుర్రుగా ఉంది. తాజాగా ఆయ‌న టీడీపీతో ట‌చ్ లో ఉన్నాడని తెలుసుకుని స‌స్పెండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kothapalli SubbaRayudu
  • TDP chandrababu naidu
  • telugu desam party

Related News

Former Andhra Pradesh CM Nadendla Bhaskara Rao Passes Away

Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటల

  • HBDOneAndOnlyCBN

    HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

Latest News

  • BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

  • Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త

  • Attack on Trump : కాల్పులకు ముందు దుండగుడి సంచలన లేఖ

  • Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd