Janasena- TDP: జనసేన, టీడీపి దూకుడుకు కేసీఆర్ సైలెంట్ చెక్
కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
- By CS Rao Published Date - 11:50 AM, Sun - 15 January 23
కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అందుకే ఖమ్మం నుంచి ఏపీ బీ ఆర్ ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తుంది. బోర్డర్ నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభావం ఉంటుంది. ఆయా జిల్లాల్లో టీడీపీ-జనసేన ప్రభావం ఉంటుంది.ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ వల్ల ఆ రెండు పార్టీలకే నష్టం జరిగేలా స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు కృష్ణాలో నందిగామ,జగ్గయ్యపేట స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు..ఈ రెండు స్థానాలు తెలంగాణలో అటు ఖమ్మం, ఇటు నల్గొండ జిల్లాలకు బోర్డర్లో ఉంటాయి. ఇలా బోర్డర్ లో ఉంటే స్థానాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారు.అలాగే బాపట్ల, గుంటూరు, విశాఖ ఎంపీ సీట్లలో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అంటే ఇవి టీడీపీకి పట్టున్న స్థానాలే. మొత్తానికి కేసీఆర్ స్కెచ్ మాత్రం టీడీపీ-జనసేనలని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు.
Also Read: Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
టీడీపీ-జనసేనలకు నష్టం జరగడమే కేసీఆర్ వ్యూహం అని చెప్పవచ్చు. ఆ ఓట్లు చీలితే ఆటోమేటిక్గా వైసీపీకి లాభం జరుగుతుంది. ఇదే క్రమంలో కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అది కూడా తెలంగాణకు బోర్డర్గా ఉన్న జిల్లాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలు అయిన..పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారట. మొత్తం 20 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దిశగా వెళుతున్న కేసీఆర్..అక్కడ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. నిదానంగా పార్టీని విస్తరించే క్రమంలో కీలక నేతలని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులని చేర్చుకున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇంకా అక్కడ కొందరు కీలక నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ఆ క్రమంలో కాపు ఓట్లు, అమరావతికి అనుకూలంగా ఉన్నవారి ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నెల 18న కేసీఆర్ ఖమ్మం సభ ఆయన ఎత్తుగడలను తేల్చనుంది. ఆ రోజు ఆయన ఇచ్చే స్పీచ్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనుంది.
Tags
Related News
Janasena : అల్లు అర్జున్ కూడా గ్లాస్ పట్టుకున్నాడు..ఇక తగ్గేదెలా
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గాజు గ్లాస్ పట్టుకొని ఉండడంతో ఇన్ డైరెక్ట్ గా బన్నీ జనసేన కు మద్దతు ఇస్తున్నారని చెపుతున్నారు