HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kanna Lakshmi Narayana Looks Tdp And Janasena

Kanna Lakshmi Narayana: జ‌న‌సేన‌, టీడీపీ వైపు `క‌న్నా` న‌డ‌క‌?

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సీనియ‌ర్ పొలిటిషియ‌న్. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా ఉన్నారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వ‌ద్ద పెద్ద ఎత్తున

  • Author : CS Rao Date : 20-10-2022 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సీనియ‌ర్ పొలిటిషియ‌న్. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడుగా ఉన్నారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వ‌ద్ద పెద్ద ఎత్తున న‌జ‌రానా తీసుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఏపీ బీజేపీ అధ్య‌క్ష‌త ప‌ద‌వి ను పోగొట్టుకున్నారు. ఆయ‌న స్థానంలో సోము వీర్రాజు ప్ర‌స్తుతం బీజేపీ చీఫ్ గా ఉన్నారు. తొలి నుంచి వాళ్లిద్ద‌రి పొస‌గ‌దు. కేవ‌లం వీర్రాజు కార‌ణంగా జ‌న‌సేన పార్టీ బీజేపీకి దూరం అయింద‌ని తాజాగా క‌న్నా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, ఆయ‌న ఏ పార్టీ వైపు అడుగులు వేయ‌బోతున్నార‌నే దానిపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీ నారాయణ మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు ప్రాధాన్యత ఉండేది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోయేలోపు కమలం లాగేసుకుంది. పార్టీలోకి తీసుకుని బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్ప‌గించారు. అమరావతి విషయంలో ఆయన స్పీడు కారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి హైకమాండ్ కన్నాను తప్పించిందని మ‌రో టాక్‌. అంతేకాదు, టీడీపీతో మిలాఖ‌త్ అయ్యాడ‌ని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచీ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ ఆ పార్టీలోనే అసంతృప్తిగా ఆయ‌న కొన‌సాగుతున్నారు.

తాజాగా బీజేపీపై పవన్ వ్యాఖ్యలతో కన్నా బరస్టయ్యారు. సోము వీర్రాజు కారణంగానే ఏపీలో బీజేపీ పరిస్థితి దిగజారిందనీ, ఆయన ఒంటెత్తు పోకడలతో పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్య అనుచరులతో బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆయన నేడో రేపో కమలం గూటి నుంచి బయటకు రావడం ఖాయమంటున్నారు. ఏ పార్టీలో చేరనున్నారన్న విషయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సామాజిక వర్గ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ దృష్ట్యా సైకిలెక్కడం ఖాయమని మరి కొందరు భావిస్తున్నారు.

ఏ గూటికి చేరినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేస్తారన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడిగానూ తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ తరువాత అమరావతి పోరాటంలో తెలుగుదేశంతో కలిసి నడిచారు. దీంతో ఆయన జనసేన వైపు కంటే తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ పెదకూరు పాడు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చినా ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతేకాదు, నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆయన దృష్టి సారించినట్లు టాక్ ఉంది.

ఇప్పుడు ఆయన పార్టీ మారడమంటూ జరిగితే ఆయన నరసరావు పేట లోక్ సభ స్థానం, గుంటూరు2, సత్తెన పల్లి అసెంబ్లీ స్థానాలపై ప‌ట్టుబ‌డ‌తారు. ఆయ‌న‌తో పాటు కుటుంబంలోని మ‌రొక‌రికి అవకాశంఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఒక వేళ తెలుగుదేశం పార్టీ వైపే ఆయన మొగ్గు చూపితే స‌త్తెన‌ప‌ల్లి నియోజకవర్గం విషయంలో అభ్యంతరం ఉండదని అంటున్నారు. ఎందుకంటే గుంటూరు 2 నియోజకవర్గంను వ‌దులుకోవ‌డానికి టీడీపీ సిద్ధంగా లేదు. మొత్తం మీద కన్నా బీజేపీపై చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న పార్టీ మార‌డంపై దుమారాన్ని రేపుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • Janasena
  • kanna lashmi narayana

Related News

Electricity demand in Andhra Pradesh to double in ten years: Experts warn against grid expansion

పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

  • PURE EV launches new showroom in Kadapa

    కడపలోకి PURE EV సరికొత్త షోరూమ్‌ ప్రారంభం

Latest News

  • తెలంగాణలో రీసైక్లింగ్ ఛాంపియన్లకు ఐటిసి వావ్ (ITC WOW) పురస్కారాలు

  • యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం

  • అధ్యక్షుడు కాదు.. అంతర్జాతీయ రౌడీ..ట్రంప్ పై మండిపడ్డ యూకే ఎంపీ

  • హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగంగా ‘ఏఐ ఇంజనీర్’

  • మీ చిన్నారుల చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుందా ?.. అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే..!

Trending News

    • 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

    • పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

    • దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్

    • వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూమ్‌, గూగుల్ మీట్‌కు గ‌ట్టి పోటీ?!

    • మీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ మార్పులు గ‌మ‌నిస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd