‘Jenda’ : రేపు జరగబోయే టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ పేరు..
- By Sudheer Published Date - 12:33 AM, Tue - 27 February 24
![‘Jenda’ : రేపు జరగబోయే టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ పేరు..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/tdp-janasena-jenda.jpg)
ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పొత్తులో వెళ్తున్న టీడీపీ – జనసేన (TDP-Janasena) తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు..రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుండగా..ఇప్పుడు జనసేన అధినేత కూడా బాబు తో జత కట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇందులో భాగంగా రేపు (ఫిబ్రవరి 28) టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు ‘జెండా’ (Jenda)గా నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఉమ్మడి జాబితాను రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఈ సభలో పాల్గొనబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ ఉమ్మడి జాబితా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. టికెట్ దక్కని నేతలు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ లో ఈ అసమ్మతి సెగ అనేది తారాస్థాయికి చేరింది. 175 స్థానాలకు గాను కేవలం 24 స్థానాలకే జనసేన పరిమితం కావడం తట్టుకోలేకపోతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే అధినేత పవన్ కేవలం 24 సీట్లకే పోటీ చేస్తానడం ఫై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేసారు.
Read Also : Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Sri Reddy : శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చిన కూటమి సర్కార్..పలు సెక్షన్ల తో కేసు నమోదు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/case-srireddy.jpg)
Sri Reddy : శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చిన కూటమి సర్కార్..పలు సెక్షన్ల తో కేసు నమోదు
చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.