HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Government In Defense Mode On Cag Report

CAG Report: టీడీపీకి దొరికిన‌ అస్త్రం.. వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన కాగ్ రిపోర్ట్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజ‌గా కాగ్‌ నివేదిక స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్ల‌డించిది.

  • Author : HashtagU Desk Date : 26-03-2022 - 1:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cag Report Andhra Pradesh
Cag Report Andhra Pradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజ‌గా కాగ్‌ నివేదిక స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్ల‌డించిది. దీంతో రాష్ట్ర‌ ఆర్ధిక పరిస్థితిపై మరోసారి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశంపార్టీ టార్గెట్ చేసింది. కాగ్ ఇచ్చిన రిపోట్ ఆధారంగా జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ నాయ‌కులు ఎటాక్ మొదలుపెట్టారు.

ఈ నేప‌ధ్యంలో తెలుగుదేశంపార్టీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. కాగ్ రిపోర్ట్ నేప‌ధ్యంలో ఏపీ ప్ర‌భుత్వం చేసిన నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సొమ్ము, వైసీపీ నేత‌ల జేబుల్లోకి వెళ్లాయ‌ని టీడీపీ త‌మ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం 1.78 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు పెడితే, అందులో 48వే ల కోట్ల‌కు సంబంధించిన లెక్కలు మిస్ అయ్యాయ‌ని కాగ్ రిపోర్ట్ చేబుతున్న నేప‌ధ్యంలో, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు చెప్ప‌లేక‌పోతుంద‌ని కొంద‌రు తెలుగుదేశం త‌మ్ముళ్ళు ప్ర‌శ్చిస్తున్నారు.

ఇక కాగ్ రిపోర్ట్ బ‌య‌ట‌కు రాగానే 48వేల కోట్ల ఖ‌ర్చుకు సంబంధించి, స్పెష‌ల్ బిల్లుల పేరుతో ఖ‌ర్చు పెట్టామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని, అస‌లు ట్రెజ‌రీ కోడ్‌లో స్పెష‌ల్ బిల్లు అనేది లేద‌ని మ‌రో షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిందిబ టీడీపీ. దీంతో రాష్ట్రంలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జ‌రుగుతుంద‌ని, వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో కేంద్రం ఆర్టిక‌ల్ 360ని అమ‌లు చేయాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా చివ‌రి రోజున స‌భ‌లో కాగ్ రిపోర్ట్ ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన  48 వేల కోట్లకి బిల్స్ లేవని కాగ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. అంతే కాకుండా అదనంగా చేసిన 88 వేల కోట్ల అప్పును కూడా బడ్జెట్‌లో చూపించలేదని కాగ్ స్పష్టం చేసింది. ఈ క్ర‌మంలో ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలులేద‌ని అయితే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం శాస‌న‌స‌భ‌ ఆమోదం లేకుండానే అడ్డదిడ్డంగా ఖర్చు చేసేసిందని కాగ్ వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో బిల్లులు లేకుండా చెల్లించిన మొత్తాలకు స్పెషల్ బిల్లులుగా ఏపీ ప్రభుత్వం పేర్కొన‌గా, దీన్ని కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం పై టీడీపీ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. దీంతో సీఎం జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌లు డిఫెన్స్‌లో ప‌డ‌గా, టీడీపీకి తొలిసారి అస్త్రం దొరికింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Governament
  • Article 360
  • cag report
  • chandrababu
  • Special Bills
  • tdp
  • Tresary Code
  • ys jagan
  • ysrcp

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd