CM Jagan : జగన్ ను యేసుక్రీస్తుగా పోలుస్తూ ప్లెక్సీలు
- By Sudheer Published Date - 03:14 PM, Thu - 21 December 23
జగన్ పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి ని యేసుక్రీస్తు గా పోలుస్తూ ఆ పోస్టర్లను డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడుతున్నారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు నక్క చిత్రాన్ని చిత్రించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జగనన్న కనెక్టు పేరుతో తాడేపల్లి ప్యాలెస్ వర్గాల ఆదేశం తోనే ఈ పోస్టర్లు ఏర్పాటు చేసారని తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పోస్టర్ ను లోతుగా చూస్తే..విభిన్న వస్త్రదారణతో సీఎం జగన్ చిత్రం వేశారు. జగన్ను చూస్తూ చేతులెత్తి మోక్కుతున్న చిన్నారిని ఎత్తుకున్న తండ్రి తో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్టు పచ్చి అబద్దాలతో ఆ పక్కనే భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పోస్టర్లో కనబడే విధంగా చిత్రికరించారు. అలాగే పోస్టర్లో దింసా నృత్యం, హరిదాసు, గంగిరెద్దులాడించే వాడు, పల్లెకారులు, కల్లుగీత కార్మికులు కనపడుతున్నారు. ఈ పోస్టర్పై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిత్వ హననం జరిగేలా పోస్టర్ వేసినా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎలా అంగీకరించింది అని విపక్షాలు మండిపడుతున్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లే మార్గంలో పోస్టర్లు వెలిశాయి.
Read Also : Beauty Tips: మెడ నల్లగా ఉందని ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది ఒక్కసారి రాస్తే చాలు?
Related News
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?
అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.