Jagan Delhi Secret : జగన్ `ముందు`కు..! ఢిల్లీ అందుకే..!!
Jagan Delhi Secret : జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? అక్టోబర్ 10వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రానుందా?
- By CS Rao Published Date - 04:01 PM, Tue - 3 October 23
Jagan Delhi Secret : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? అక్టోబర్ 10వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రానుందా? ఆ లోపు ఏపీ ఎన్నికలపై క్లారిటీ రానుందా? అందుకే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనం అయ్యారా? ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. ఎందుకంటే, చాలా కాలంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి కోటరీ పరోక్షంగా తీసుకొస్తోంది. గడువు ప్రకారం మాత్రమే ఎన్నికలకు ఉంటాయని చెబుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు మాత్రం ముందస్తు లీకులు ఇవ్వడం గమనార్హం.
జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు..(Jagan Delhi Secret )
ఈనెల 6వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఆ మేరకు అపాయిట్మెంట్ లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సీఎం అయిన తొలి రోజుల్లో అమిత్ షా అపాయిట్మెంట్ చాలా కష్టంగా ఆయన దొరికేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ లను ఇస్తున్నారు. ఇటీవల లండన్ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పది రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఆ సందర్భంగా ఏపీలో చంద్రబాబును జైలుకు పంపే ప్రక్రియ నడిచింది. లండన్ నుంచి తిరిగి తాడేపల్లి వచ్చేటప్పటికి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏపీ సీఐడీ ఉంచింది. కానీ, ఆ తరువాత టార్గెట్లను జగన్మోహన్ రెడ్డి రీచ్ (Jagan Delhi Secret ) కాలేకపోయారు.
జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ స్కెచ్
మార్గదర్శి ఎండీ శైలజ, రామోజీరావు, లోకేష్ తదితరులను జైలుకు పంపాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ . దాన్ని రీచ్ కావడానికి పరిస్థితులు కొందరు అనుకూలంగా లేవు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం వెళుతున్నారని తాడేపల్లిలోని టాక్. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ తీసుకోవడం కూడా మరో అంశంగా ఉందని తెలుస్తోంది. ప్రత్యర్థుల్లోని బలమైన వాళ్లను జైలుకు పంపించడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ స్కెచ్ గా వైసీపీలోని ఒక వర్గం చెప్పుకుంటోంది. ఆ క్రమంలో ఢిల్లీ బాట (Jagan Delhi Secret ) పట్టారని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన
వాస్తవంగా లండన్ నుంచి తిరిగొచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కానీ, షెడ్యూల్ సహకరించకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఇటీవల ఆదానీ తాడేపల్లిలోని నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. వాళ్లిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఆ భేటీ గురించి బయటకు రాలేదు. ఇప్పటికే ఓడరేవులు, విమానాశ్రాయాలను కైవసం చేసుకున్న ఆదానీ ఇప్పుడు కొత్త వాటి కోసం ఎత్తుగడ పన్నారని తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా వాన్ పిక్ ప్రాజెక్టు ఉంది. దాన్ని రివోక్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఓడరేవులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను తయారు చేయాలని చూస్తున్నారని వినికిడి. దాని కోసం ఆదానీ ఏపీకి (Jagan Delhi Secret ) వచ్చారని టాక్.
Also Read : Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మసాక్షి లేటెస్ట్ సర్వే వెల్లడి!!
సొంత కేసులు, ఆదానీ ప్రాజెక్టులు, ముందస్తు ఎన్నికలు..తదితర అంశాలతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారని ప్రచారం ఉంది. కానీ, చంద్రబాబును జైలులో పెట్టిన తరువాత ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి భేటీ కాలేదు. వాళ్లకు చెప్పకుండా చంద్రబాబును జైలుకు పంపడం అసాధ్యం. ఉమ్మడిగా చేసిన కుట్రగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ను అందించడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారని టీడీపీ భావిస్తోంది. మొత్తం మీద ఈనెల 6న ఢిల్లీ ఫైట్ ఎక్కనున్న జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Elections: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం
Related News
CM Jagan Nomination: సీఎం జగన్ నామినేషన్ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ భారతి..?
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.