IT Raids : విజయవాడలో ఐటీ సోదాల కలకలం.. ప్రముఖ బంగారం షాపుల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు
విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- By Prasad Published Date - 09:34 AM, Sun - 10 December 23
విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర భద్రతా బలగాల నడుమ బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. బాంబే జువెల్లర్స్, ఆంజనేయ జువెలర్స్ షోరూమ్లలో ఈ సోదాలు చేస్తున్నారు. నో సేల్స్ బోర్డ్ తగిలించి మరీ డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోంది. షోరూమ్లో పనిచేసే సిబ్బందిని బయటకు పంపించి, అకౌంటెంట్లు, మేనేజర్ల సమక్షంలో రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో.. అధికారులు ఆరాతీస్తున్నారు. గోల్డ్ క్రయ విక్రయాలకు సంబంధించి సాఫ్ట్, హార్ట్ కాపీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సీజ్ చేసిన కీలక డాక్యుమెంట్లపై కూపీ లాగుతున్నారు. విచారణలో హైదరాబాద్కు చెందిన జువెల్లర్ సంస్థల పాత్ర కూడా బయటపడినట్టు తెలుస్తోంది. ఆ దిశలో కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు.
Related News
Vijayawada : సమ్మర్లో సింపుల్ ట్రిప్ దగ్గర్లో ప్లాన్ చేస్తున్నారా? అయితే విజయవాడ చుట్టు పక్కల అన్నీ చూశారా?
విజయవాడని ఇప్పటివరకు చూడలేదంటే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.