HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Internal Politics In Ysrcp In Andhra Pradesh

YSRCP Politics : వైసీపీ కుమ్ములాట‌! 13 జిల్లాల చిత్రం !!

శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వ‌ర‌కూ జ‌గ‌న్ పాల‌న మీద వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. పెరిగిన ధ‌ర‌లు, అధ్వాన రోడ్లు, చెత్త ప‌న్నులు, ఓటీఎస్, కాన‌రాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మ‌ద్యం ఒక‌టేమిటి ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ప్ర‌తీప‌నీ ప్ర‌జ‌ల‌కి భారంగా మారింది.

  • By CS Rao Published Date - 04:30 PM, Mon - 3 January 22
  • daily-hunt
Jagan Ap Map
Jagan Ap Map

శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వ‌ర‌కూ జ‌గ‌న్ పాల‌న మీద వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. పెరిగిన ధ‌ర‌లు, అధ్వాన రోడ్లు, చెత్త ప‌న్నులు, ఓటీఎస్, కాన‌రాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మ‌ద్యం ఒక‌టేమిటి ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ప్ర‌తీప‌నీ ప్ర‌జ‌ల‌కి భారంగా మారింది. ఇదే స‌మ‌యంలో వైసీపీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు రాబోయే రోజుల్లో క‌లిసివ‌స్తాయ‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. ఆయా జిల్లాలోని గ్రూప్ విభేదాలు వైసీపీ అధిష్టానంకు త‌ల‌నొప్పిగా మారింది.ప్ర‌కాశం జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పూర్తిగా పార్టీకి దూరం ఉంటున్నాడు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీతో సంబంధ‌మే లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి ఫోన్ల‌కి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. చీరాల‌లో టిడిపి నుంచి వ‌చ్చిన క‌ర‌ణం బ‌ల‌రాం..అంత‌కుముందే వైసీపీలో ఉన్న‌ ఆమంచి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇక జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న బావ‌మ‌రిది బాలినేని శ్రీనివాస‌రెడ్డి మ‌ధ్య వైరం చాప‌కింద నీరులా పార్టీని న‌ష్ట ప‌రుస్తోంది. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్ష‌ణంలోనైనా రాజీనామా చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల టాక్‌.

చిత్తూరు జిల్లాలో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్ర‌శ్నిస్తే చాలు సొంత పార్టీ వారైనా లోప‌లేయిస్తున్నార‌ని వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైసీపీ నేత‌ల‌దీ ఇదే మాట‌. పెద్దిరెడ్డి బ‌స్సుల్లో ఓట్లు త‌ర‌లించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడ‌గొడుతున్నారు.న‌గ‌రి ఎమ్మెల్యే రోజాది మ‌రీ దారుణ‌మైన ప‌రిస్థితి. త‌న‌కు పోటీగా ఎదుగుతున్నార‌ని వైసీపీ నేత‌ల్ని స‌స్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో సొంతంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌లు మ‌ధ్య వైరం తీవ్రం అవుతోంది. ఎంపీ రంగ‌య్య‌, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన‌ప‌డ్డాయి. క‌దిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప‌ద‌వులు అమ్ముకున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డంతో వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి… త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో లోక‌ల్ మాఫియాలు దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు- మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అస్స‌లు పొస‌గ‌డంలేదట‌. గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్‌ క్యాడర్‌ నేతలు త‌ర‌చూ ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట‌కి మ‌ధ్య వివాదం కేసుల వ‌ర‌కూ చేరింది.

గుంటూరు జిల్లాలో న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినితో విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి. కృష్ణ‌దేవ‌రాయ‌లు పూర్తిగా పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో వున్నార‌ని స‌మాచారం. వైసీపీలో మొద‌టి నుంచీ ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వైరాగ్యంతో తిరిగి న్యాయ‌వాదిగా ప్రాక్టీసుకి వెళ్లిపోయాడు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాప‌ట్ల ఎంపీ సురేష్ మ‌ధ్య వాటాల తేడాతో గొడ‌వ‌లు ముదిరి రోడ్డున‌ప‌డ్డాయి. శ్రీదేవిని హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావాల‌ని అధినేత ఆదేశించార‌ని వైసీపీలో గుస‌గుస‌లు. కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరిన టిడిపి నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో ఒక‌రినొక‌రు దెప్పిపొడుచుకుంటున్నారు. పాత‌త‌రం పాలిటిక్స్ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారట‌. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు….దేవినేని అవినాష్‌ని టార్గెట్ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. వంగ‌వీటి రాధ హ‌త్య‌కి అవినాష్ ఆంత‌రంగికుడు అర‌వ స‌త్యం రెక్కీ నిర్వ‌హించాడ‌ని సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌పెట్టింది ఆ ఘ‌ట‌న‌. మ‌రోవైపు పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి.ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌, ఎమ్మెల్యే ఎలీజా మ‌ధ్య ఉన్న గ్యాప్ స్థానికసంస్థ ఎన్నిక‌ల్లో బ‌ట్ట‌బ‌య‌లైంది. మంత్రి ఆళ్ల‌నానితోనూ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు బాగా దూరం పెరిగింది.

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రినొక‌రు ఎప్పుడు దెబ్బ‌కొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నార‌ట‌.విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బ‌కి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారు. ఇటీవ‌లే వైసీపీ జెండా క‌ప్పుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్ అల‌క‌బూనారు. మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో వున్నార‌ని ఆయ‌న వ‌ర్గీయుల నుంచి వినికిడి. పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి స్థానిక వైసీపీ నేత‌ల‌కి మ‌ధ్య చాలారోజుల్నించి వివాదాలు న‌డుస్తూనే వున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన కృష్ణ‌దాసు వ‌ర్గం, త‌మ్మినేని వ‌ర్గం, సీదిరి స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతూ…ఇది మునిగిపోయే ప‌డ‌వ‌…మీ దారి మీరు చూసుకోండ‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం.విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వాకి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న‌శ్రీను తెర‌పై క‌నిపిస్తున్నాడు. తాడేప‌ల్లి ప్యాలెస్ ఆశీస్సుల‌తో ఆయ‌న దూకుడుగా ఉన్నాడ‌ట‌. ఫ‌లితంగా ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లులా రాజుకుంటోంది రాజ‌కీయం. మొత్తం మీద రాష్ట్రంలో 13 జిల్లాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గ్రామ‌స్థాయి వ‌ర‌కూ గ్రూపులుగా వైసీపీ వ‌ర్గ‌పోరాటం క‌నిపిస్తోంది. ఇదంతా అధిష్టానంకు తెలిసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని పార్టీ వ‌ర్గాల్లో ఉంది. దీంతో గ్రూపుల‌ పోరు క్ర‌మంగా అన్ని చోట్లా తారాస్థాయికి వెళ్లింది. .


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • margani bharat ram
  • vijay sai reddy
  • ys jagan
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • Bank of Baroda Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

    • Bambino Agro Industries : బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం

    • Diwali Celebration : సమంత దీపావళి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుందో తెలుసా..?

    • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

    • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

    Trending News

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd