Home Minister Vanitha : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ హోంమంత్రి
రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.
- By Prasad Published Date - 02:18 PM, Thu - 14 July 22

రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. మద్దూరులంక, ములకల్లంక గ్రామాల్లో వరద బాధితులను హోంమంత్రి వనిత, జిల్లా కలెక్టర్ మాధవి లత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పరామర్శించారు.
సీతానగరం మండలం బొబ్బిలి లంక నుంచి ములకల్లంక గ్రామానికి పడవపై వెళ్లారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధికారుల సూచనలను పాటించి పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి కోరారు. అంతకుముందు కొవ్వూరు మండలం మద్దూరులంక ముంపు ప్రాంతాన్ని సందర్శించారు. పునరావాస కేంద్రానికి తరలిస్తున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి 2000 రూపాయల పరిహారం ప్రకటించారని ఆమె వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మాధవి లత ఆదేశాల మేరకు గురువారం ఉదయం కడియం మండలం బుర్రిలంక గ్రామంలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కృష్ణారావు తెలిపారు.
Related News

CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హ�