HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Tension Situation At Gudivada Small Psycho In Gudivada Chandrababu Naidu

Chandrababu: గుడివాడలో చిన్న సైకో.. ఇదేం ఖర్మలో చంద్రబాబు..!

తాడేపల్లి సైకో రాష్ట్రంలో చిన్న సైకోలను తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుడివాడ (Gudivada)లో అర్ధరాత్రి వరకు జరిగిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం జరిగింది.

  • Author : CS Rao Date : 14-04-2023 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN
Resizeimagesize (1280 X 720) (1)

తాడేపల్లి సైకో రాష్ట్రంలో చిన్న సైకోలను తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుడివాడ (Gudivada)లో అర్ధరాత్రి వరకు జరిగిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని మీద విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు, ఎమ్మెల్యేగా గెలిచిన సీటు గుడివాడ అన్నారు. యుగ పురుషుడు తిరిగిన గుడివాడలో నేడు గంజాయి మొక్క వచ్చింది అన్నారు. ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే రోడ్డు మీదకు వస్తాడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. గాడి తప్పిన వీళ్లను చరిత్ర హీనులుగా నిలబెడతామన్నారు. ఎన్టీఆర్‌ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారని.. క్యాసినోలు తెచ్చారు.. క్యాబరేలు చేయించారు అన్నారు. భూకబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ అరాచకాలే అన్నారు. అభివృద్ధి పట్టదని.. నోరు విప్పితే బూతులే అన్నారు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో ప్రజలే తేల్చండి అన్నారు.

నిన్నటి వరకు తానే గెలుస్తా తెలుగు దేశం లేదు అని సీఎం అన్నారని.. ఆకాశంలో తిరుగుతున్న జగన్‌ను భూమి మీదకు దింపాలి అనుకున్నానన్నారు. పట్ట భద్రుల ఎన్నికల్లో అన్ని సీట్లూ టీడీపీనే గెలిచిందని.. ఈ ఎన్నికల ఫలితాలతో ఆకాశంలో ఉండే వ్యక్తి కిందకు చూడడం మొదలు పెట్టారన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి.. మద్యం సైతం నాసిరకంగా ఉందన్నారు. కిరాణా షాపులో కూడా ఆన్ లైన్ లావాదేవీలు తీసుకుంటున్నారు.. మరి మద్యం షాపుల్లో ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

Also Read: Geetham University : గీతం యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. అర్థ‌రాత్రి జేసీబీల‌తో వెళ్లిన అధికారులు

అమరావతి అందుకే

హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కావాలని అమరావతిని మొదలు పెట్టానని.. కానీ మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారన్నారు. కృష్ణా డెల్లాకునీరు తేవాలని నాడు 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసిన నదుల అనుసంధానం చేశామన్నారు. భస్మాసురుడిని నమ్మి శివుడు వరం ఇచ్చినట్లు.. ప్రజలు జగన్‌ను నమ్మి ఓట్లు వేశారు.. నష్టపోయారన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారు.. ఒక్కొక్కరిపై రెండు లక్షల కోట్ల అప్పులు పెట్టారన్నారు. ఎన్నికల ముందు కేంద్ర మెడలు వంచుతాను అని చెప్పిన జగన్.. ఇప్పుడు మెడలు దించారన్నారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా పోయింది.. పోలవరాన్ని ముంచేశారన్నారు.

అప్పుడు నన్ను నమ్మలేదు

2019 ఎన్నికల సమయంలోనే తాను నిజాలు చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు. కోడికత్తి ఒక నాటకం అని తాను ఆనాడే చెప్పాను.. ఇప్పుడు ఎన్ఐఏ కూడా అదే తేల్చిందన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీ వ్యక్తే.. ఎన్నికల ముందు సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ఆడించిన డ్రామా అన్నారు. బాబాయి హత్యతో సానుభూతి పొందారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2004లో ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం వైఎస్సార్‌ కుటుంబం ఆస్తి 1.7 కోట్లని.. ఇప్పుడు 29 రాష్ట్రాల సీఎంల ఆస్తి రూ. 505 కోట్లు అయితే.. ఒక్క ఏపీ సీఎం ఆస్తి అంతకన్నా ఎక్కువే ఉందన్నారు. టీవీలు, పేపర్లు, వ్యాపారాలు లేవనే నిరుపేద జగన్‌ ఏం చేసి రూ. 510 కోట్లు సంపాదించారో చెప్పాలన్నారు.

2 లక్షల కోట్లు దోపిడీ

గుడివాడలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో కలిసి పాల్గొన్నారు. మద్యం,ఇసుక, సహా అన్నింటిలో దోచుకున్నారని.. ఆయన అనుచరులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మరో రెండు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ చెప్పినట్లు నవ రత్నాలు కాదు.. నవ మోసాలు. ఇసుక, మద్యం, గంజాయి, అప్పులు, కబ్జాలు, విద్వంసాలు, భూ మాఫియా అంటూ వైసీపీ పాలనపై దుయ్యబట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • chandrababu naidu
  • gudivada
  • MLA Kodali Nani
  • tdp
  • ycp

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు

  • Chinnivskolikapudi

    TDP : కొలికపూడి Vs చిన్ని.. దేవుడి ముందే రచ్చ!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd