Heat Waves : ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నేడు ఎనిమిది మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం
ఏపీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మండలాల్లో నేడు (గురువారం) వేడిగాలులు
- Author : Prasad
Date : 18-05-2023 - 6:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మండలాల్లో నేడు (గురువారం) వేడిగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (APSDMA) అంచనా వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం, కడప జిల్లాలోని చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులోని ఏడు మండలాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ B R అంబేద్కర్ తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బుధవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుపతిలోని ఏర్పేడులో 46 డిగ్రీల సెల్సియస్, పల్నాడులోని నర్సరావుపేటలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది.