AP : రాజమండ్రి రూరల్ టికెట్ నాదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- By Sudheer Published Date - 11:41 AM, Wed - 21 February 24
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తుండడం తో ఇరు పార్టీల నేతల్లో కొంతమంది తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. పొత్తుల్లో భాగంగా ఇరు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే అని ప్రచారం అవుతున్న తరుణంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ ( Rajamundry Rural Ticket) నుంచి తాను పోటీలో ఉంటానని , ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ-జనసేన మధ్య పొత్తులోగా భాగంగా.. రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన నేత కందుల దుర్గేష్కి ఇస్తున్నట్టు వార్తలు వప్రచారం అవుతున్నాయి. ఆ టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవిష్యత్ ఏంటని..? కూడా చర్చ మొదలైంది. ఈ సమయంలో.. తానే పోటీలో ఉన్నట్టు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం.. రాజమండ్రి రాజకీయ చర్చకు దారితీసింది.
‘రాజమండ్రి రూరల్ బరిలో తానే ఉంటున్న…అందులో ఎలాంటి సందేహం లేదు. బయట ప్రచారం అవుతున్న వార్తలను నమ్మకండి..అధినేత చంద్రబాబు త్వరలోనే తన పేరును ప్రకటించబోతున్నారు ‘ అంటూ బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మరి కందుల దుర్గేష్ పరిస్థితి ఏంటి..? ఈ టికెట్ తనకే ఇస్తారని గత కొద్దీ రోజులుగా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఇప్పడు చౌదరి తనకే టికెట్ అని స్పష్టం చేయడం తో..జనసేన కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారు.
Read Also : Tummala Nageswara Rao : అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది
Related News
AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.