HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Godavari Flooded 100 Villages In Merged Mandals Cut Off

Godavari Floods: గోదావరి ఉగ్రరూపం, 100కు పైగా గ్రామాలు అతలాకుతలం!

భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి వరదల కారణంగా విలీన మండలాల్లోని 100కు పైగా గ్రామాలు జలమయమయ్యాయి.

  • Author : Balu J Date : 22-07-2023 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rains
Heavy Rains

KAKINADA: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి వరదల కారణంగా విలీన మండలాల్లోని 100కు పైగా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కూనవరం, టేకులబోరు (కూనవరం మండలం), వడ్డిగూడెం (వీఆర్ పురం మండలం) మూడు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల నివాసితులు గత మూడు వారాల్లో తమ ఇళ్లను ఖాళీ చేసి తమ వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా గ్రామాలు ప్రస్తుతం నాలుగు అడుగుల లోతులో వరద నీటిలో ఉన్నాయి. కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, కోనరాజుపేట తాళ్లగూడెం తదితర గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూనవరం మండలంలో దాదాపు 30 గ్రామాలు, ఏఎస్‌ఆర్ జిల్లా వీఆర్ పురంలోని 30 గ్రామాలు, కుక్కునూరులో 10, ఏలూరు జిల్లా వేలేరుపాడులో 25 గ్రామాలు వరదల కారణంగా రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయాయి.

ఈ ప్రజలు సమీపంలోని కొండ ప్రాంతాలకు చేరుకుని చీకటిలో నిద్రలేని రాత్రులు గడిపారు. వారు కొత్త పరిసరాలలో దోమలు, విష సర్పాల కారణంగా భయంగా బతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలేరుపాడు మండల ప్రజలు శివకాశీపురం, భూదేవిపేట, కుచ్చిరాల కాలనీ, గుర్రపోగు, బండ్లబోరు తదితర గ్రామాల్లో సొంతంగా తలదాచుకున్నారు. శబరి నది నుంచి విలీన మండలాలకు భారీగా ఇన్‌ఫ్లో చేరడంతో వడ్డిగూడెం వాసులు 600 మందికి పైగా తమ వస్తువులతో పాటు వరదనీటిలో నడుచుకుంటూ గ్రామం వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ గాంధీ ప్రజల కోసం నిత్యావసర వస్తువుల సరఫరా కోసం ప్రతి మండలానికి రెండు లాంచీలను ఏర్పాటు చేశారు. వడ్డిగూడెం వాసులకు రేకపల్లి గ్రామంలో ఆశ్రయం కల్పించారు. మురుమూరు-పొలిపాక ప్రధాన రహదారి జలమయం కావడంతో ఏటపాక మండలం నెల్లిపాక-ఫీరాయిగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరుపాడు మండలంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. దాచారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని తాగునీటి బోర్‌వెల్‌లను, ఆధునిక బోట్ల పనితీరును ఆయన పరిశీలించారు. దాచారం, కుక్కునూరు మధ్య ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. కొడియా, కట్కూరు ప్రాంతాలకు 16 గ్రామాలకు రోడ్డు రవాణా నిలిచిపోయిందన్నారు. వరద బాధితులకు జిల్లా యంత్రాంగం మూడు నెలల పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తుంది.

Also Read: Telangana Waterfalls: భారీ వర్షాల ఎఫెక్ట్, కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ సందర్శన బంద్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 villages
  • andhra pradesh
  • godavari floods
  • road connectivity

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd