Pawan Kalyan: `ఒక్క ఛాన్స్`తో ఏపీ జాతకం.!
`ఒక్కఛాన్స్` ఏపీ జాతకాన్ని మార్చేసింది. రాజధాని అమరావతిని ప్రశ్నార్థకం చేసింది. ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జగన్మోహన్ రెడ్డికి బాగా పనిచేసింది.
- By CS Rao Published Date - 05:32 PM, Mon - 14 November 22
`ఒక్కఛాన్స్` ఏపీ జాతకాన్ని మార్చేసింది. రాజధాని అమరావతిని ప్రశ్నార్థకం చేసింది. ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జగన్మోహన్ రెడ్డికి బాగా పనిచేసింది. ఆయన్ను సీఎం చేయడానికి ఆ స్లోగన్ కలిసొచ్చింది. అనూహ్యంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. ఇప్పుడు ఇదే స్లోగన్ ను జనసేనాని పవన్ అందుకున్నారు. ఏపీ ప్రజలు పవన్ కు కూడా `ఒక్క ఛాన్స్` ఇచ్చే విశాలహృదయులని జనసేన నమ్ముతోంది.
2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రంలో జగనన్న హౌసింగ్ స్కీమ్ (జేహెచ్ఎస్)లో వైఎస్ఆర్సీ నేతలు ₹10,500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.జగనన్న ఇల్లు పెదలందిరి కన్నీళ్లు (జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు) పేరుతో జనసేన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఆదివారం లేఅవుట్ను ఆయన సందర్శించారు. ఆ సందర్భంగా 2024 ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు.
Also Read: Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
`ప్రజాస్వామ్యం, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పాలనను చూపుతాం. సంక్షేమ పథకాలను ఆపబోం. పేదల ప్రయోజనం కోసం కొన్ని అదనపు పథకాలను జోడిస్తాము. ప్రజాధనాన్ని వృధా చేయబోము. ప్రభుత్వ సొమ్ము మొత్తం ప్రజల కోసం ఖర్చు చేస్తాం.` అంటూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవన్ సరికొత్త నినాదం అందుకున్నారు.
రాష్ట్రాన్ని అప్పుల భారీ నుంచి బయటపడేసేందుకు `ఒక్క ఛాన్స్ ` ఇచ్చి చూడండని మరో వైపు కేఏ పాల్ అభ్యర్థిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి 8లక్షల కోట్లు తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నారు. అంతేకాదు, మిగిలిన లీడర్ల మాదిరిగా ప్రజాధనాన్ని దోచుకుండా విదేశీ విరాళాలను సేకరించి ఆంధ్రాను అమెరికా చేస్తానంటూ ప్రమాణం చేస్తున్నారు. అందుకే `ఒక్క ఛాన్స్` ఇవ్వండని కోరుతున్నారు. ఒక వేళ 2024 ఎన్నికల్లో పవన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే, ఆ తరువాత 2029 ఎన్నికల్లో కేఏ పాల్ ఛాన్స్ ఉంటుందని ప్రజాశాంతి పార్టీ భావిస్తోంది.
Also Read: CBN Media: చంద్రబాబు సానుభూతి మీడియాకు సరైనోడు..!
Related News
AP Politics : వైనాట్ 175.. నవ్విపోదురుగాక..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఎన్నికలకు తెరపడింది.