Farmers Suicide : పుట్టపర్తిలో విషాదం.. ముగ్గురు రైతులు ఆత్మహత్య
పుట్టపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పుల బాధ తాళలేక
- Author : Prasad
Date : 20-09-2023 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
పుట్టపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పుల బాధ తాళలేక ఆది, సోమవారాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద వడుగూరు మండలం తిమ్మాపురం నివాసి రాము(30), గార్లదిన్నెకు చెందిన కౌలు రైతు మార్తాడు నాగేంద్ర (37), ధర్మవరంలోని సుందరయ్య నగర్కు చెందిన చెన్నారెడ్డి (42) ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తీర్చే స్తోమత లేక ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి గడిచిన తొమ్మిది నెలల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో75 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుల భారం, ప్రతికూల వాతావరణంతో పంట నష్టం, సాగునీటి కొరత, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు తీర్చలేక సెప్టెంబరు 16న రాము ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడెకరాలు కౌలుకు తీసుకుని దాదాపు తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మంచి రాబడిని ఆశించి రూ.7 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. దురదృష్టవశాత్తు పంటకు తెగుళ్లు సోకాయి.
ప్రభుత్వ పరిహారానికి అర్హత సాధించాలంటే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు వాటిని ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ధృవీకరించినప్పటికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో అప్పు తీర్చలేక రైతు రాము తనువు చాలించాడు. చాలా మంది రైతు కుటుంబాలు, అప్పుల కారణంగా తమ అన్నదాతలను కోల్పోయారు. జిల్లాలో రైతు ఆత్మహత్యలు బాధాకరమని, ఇలాంటివి పదేపదే పునరావృతం అవుతున్నాయని ప్రజా విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సురేష్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా కరువు పీడిత వాతావరణానికి పేరుగాంచిన ఈ జిల్లా, ఈ ప్రాంతంలో వ్యవసాయ కష్టాలు, రైతుల ఆత్మహత్యలకు దోహదపడే అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు వ్యవసాయ పనుల కోసం రుణాలు తీసుకుంటారని, కరువు లేదా నీటి కొరత కారణంగా పంటలు పండక లేదా తక్కువ దిగుబడి వచ్చినప్పుడు రుణాలు చెల్లించడంలో విఫలమవుతున్నారని తెలిపారు. రైతులు తరచుగా అస్థిర పంట ధరలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.